IND vs SL: బుమ్రా, దూబే ఔట్.. భారత జట్టులో రెండు కీలక మార్పులు..
India vs Sri Lanka, Super Fours, 18th Match (A1 v B1): ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్స్ రౌండ్ చివరి మ్యాచ్ భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతోంది. రెండు జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా ఆరో విజయం కోసం చూస్తోంది.

India vs Sri Lanka, Super Fours, 18th Match (A1 v B1): ఆసియా కప్ 2025 లో చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం జనిత్ లియానేజ్కు జట్టు అవకాశం ఇవ్వగా, భారత జట్టు రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, శివం దుబేలకు విశ్రాంతి ఇచ్చారు. అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు.
వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి భారత్ ఇప్పటికే ఫైనల్కు అర్హత సాధించగా, శ్రీలంక వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి రేసు నుంచి నిష్క్రమించింది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా ఆడనుండటం గమనార్హం. అందుకే జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దుబే ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. మరోవైపు, టోర్నమెంట్ లో అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా ఆడిన రెండవ మ్యాచ్ ఇది. గతంలో, ఇద్దరు ఆటగాళ్లు ఒమన్ తో ఆడారు.
ఇక రింకూ సింగ్, జితేష్ శర్మ మరోసారి జట్టులో చోటు కోల్పోయారు. ఇద్దరు ఆటగాళ్లు స్వ్కాడ్లో ఉన్నారు. కానీ, ఇంకా ప్లేయింగ్ 11లో చేరలేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లను శ్రీలంకతో జరిగే మ్యాచ్లో బరిలోకి దింపుతారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
Our Playing XI for #INDvSL 👌
Updates ▶️ https://t.co/xmvjWCaN8L#TeamIndia | #AsiaCup2025 | #Super4 pic.twitter.com/l9R2mJRSKM
— BCCI (@BCCI) September 26, 2025
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి.
శ్రీలంక: పాతుమ్ నిశంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, జనిత్ లియానాగే, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, నువాన్ తుసార.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








