IND vs SL: తొలి టెస్ట్‌కు ముందే మైండ్ గేమ్ షురూ.. టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!

Dhananjaya De Silva Warning: స్వదేశంలో ఎదురైన పరాజయాల నుంచి కోలుకుని మళ్లీ గెలుపు బాట పట్టాలని భారత్ భావిస్తుంటే, లంక మాత్రం తమ సొంత గడ్డపై స్పిన్ మంత్రంతో దెబ్బకొట్టాలని చూస్తోంది. తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ గాలే టెస్టు క్రీడాభిమానులకు విపరీతమైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

IND vs SL: తొలి టెస్ట్‌కు ముందే మైండ్ గేమ్ షురూ.. టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన శ్రీలంక కెప్టెన్..!
Dhananjaya De Silva Warning To Team India

Updated on: Aug 13, 2026 | 12:42 PM

Dhananjaya De Silva Warning to Team India: ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా భారత జట్టుతో జరగనున్న మొదటి టెస్టుకు ముందే శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వ సంచలన వ్యాఖ్యలతో టీమిండియా ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. స్వదేశంలో సిరీస్‌లు కోల్పోయి గాయపడ్డ సింహాల్లా ఉన్న భారత్‌ను స్పిన్ పిచ్‌లపై ఎదుర్కోవడం తమకు మరింత సులువవుతుందని, గాలే మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టేందుకు తమ వద్ద పవర్ ఫుల్ స్పిన్ ఆయుధం ఉందంటూ సవాల్ విసిరారు.

ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతోంది. గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న శ్రేయాస్, శుభ్‌మన్ గిల్ సేనకు ఈ పర్యటన నిజంగానే పెద్ద పరీక్ష కానుంది. ఈ క్రమంలో శ్రీలంక సారథి ధనంజయ డి సిల్వ మ్యాచ్‌ ప్రారంభానికి రెండే రోజుల ముందు భారత జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు మైండ్ గేమ్స్ మొదలుపెట్టారు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లు ఓడిపోయిన టీమిండియా ఇప్పుడు పగ తీర్చుకోవాలనే ఆరాటంలో ఉంటుందని, అయితే గాలే వేదికగా తమకున్న ఘనమైన రికార్డులే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎక్కువమంది చదివింది: Video: ట్రావిస్ హెడ్‌కి అసలైన మొగుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా.. సొంతగడ్డపై దిమ్మతిరిగే షాక్..!

ఇవి కూడా చదవండి

గాలే మైదానంలో ప్రభాత్ జయసూర్య మాయాజాలం..

ఈ పోరులో భారత బ్యాటర్లను కట్టడి చేయడానికి తమ వద్ద ఉన్న అతిపెద్ద ఆయుధం ప్రభాత్ జయసూర్య అని డి సిల్వ స్పష్టం చేశారు. గాలే పిచ్ పై ప్రభాత్‌కు ఉన్న అనుభవం, లెక్కల పరంగా ఉన్న గణాంకాలు లంకకు కొండంత బలాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఇక్కడ అనేక విదేశీ జట్లను ప్రభాత్ తన గిరగిరా తిరిగే స్పిన్ బంతులతో తిప్పలు పెట్టాడని, భారత జట్టుకు కూడా ఇది మినహాయింపు కాదని హెచ్చరించారు. అంతేకాకుండా టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరం కావడం లంకకు కలిసొచ్చే పెద్ద అంశమని, అతడు లేకపోవడం భారత్‌కు పెద్ద లోటని ఆయన గుర్తు చేశారు.

లంక మాస్టర్ ప్లాన్.. మ్యాచ్‌ను నాలుగో రోజుకు తీసుకెళ్లడమే..!

టీమిండియాను ఓడించడానికి తమ వద్ద ఒక స్పష్టమైన ప్రణాళిక ఉందంటూ డి సిల్వ వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదని, మ్యాచ్‌ను నాలుగో, ఐదో రోజు వరకు తీసుకెళ్లగలిగితే భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించే అవకాశాలు తమకే ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. భారత బ్యాటర్లను క్రీజులో ఎక్కువ సమయం ఉండనీయకుండా పరుగులు కట్టడి చేయడమే తమ ప్రధాన వ్యూహమని లంక సారథి స్పష్టం చేశారు. గాలే పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు స్వర్గధామం అయినప్పటికీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల తేమ పెరిగి తొలి రెండు, మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాత నుంచి స్పిన్ తిరగడం మొదలవుతుందని ఆయన వివరించారు.

వార్మప్ మ్యాచ్ విక్టరీ ఇచ్చే కొండంత ఆత్మవిశ్వాసం..

మరోవైపు శ్రీలంక ఎలెవన్ జట్టుతో జరిగిన అభ్యాస మ్యాచ్‌ను భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుచుకుని శుభారంభం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 363 పరుగులు చేయగా, భారత్ 357 పరుగులకు ఆలౌటైంది. చివరి సెషన్‌లో మొహమ్మద్ సిరాజ్ కేవలం 15 బంతుల్లోనే 32 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఈ వార్మప్ విజయంతో గిల్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగుతుండగా, లంక సవాల్‌ను ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us