సెమీఫైనల్‌లో సెంచరీ.. ఆ తర్వాత వారికి ‘ఐ లవ్ యూ’.. నెట్టింట్లో సందడి చేస్తోన్న క్రీడాశాఖ మంత్రి.. ఎవరంటే?

|

Jun 16, 2022 | 3:41 PM

మధ్యప్రదేశ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో మనోజ్ తివారీ తన సెంచరీని పూర్తి చేయగానే, అతను ఆ కాగితాన్ని గాలిలో ఊపుతూ తన ప్రేమను చాటుకున్నాడు.

సెమీఫైనల్‌లో సెంచరీ.. ఆ తర్వాత వారికి ఐ లవ్ యూ.. నెట్టింట్లో సందడి చేస్తోన్న క్రీడాశాఖ మంత్రి.. ఎవరంటే?
Manoj Tiwary
Follow us on

రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌లో బెంగాల్ జట్టు కష్టాల్లో పడిన వేళ.. ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి చొరవ తీసుకున్నారు. మనోజ్ తివారీ బెంగాల్ జట్టు తరపున నాకౌట్ మ్యాచ్‌ల్లో అదరగొడుతున్నాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో సెంచరీ బాదిన అతను ఇప్పుడు సెమీ ఫైనల్‌లోనూ సెంచరీ బాదేశాడు. కానీ, ఈసారి సెంచరీ చేసిన తర్వాత అతను చేసిన ఓ పని నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. రంజీ ట్రోఫీ సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో మనోజ్ తివారీ 211 బంతులు ఎదుర్కొని 102 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 205 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. అతను చేసిన పనితో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 29వ సెంచరీ చేసిన తర్వాత, మనోజ్ తివారీ తన కుటుంబ సభ్యులందరికీ ఐ లవ్ యూ అని ప్రత్యేకంగా రాసిన ఓ కాగితాన్ని ప్రదర్శించాడు. వారు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. మనోజ్ తివారీ ఒక కాగితంపై గుండె చిత్రాన్ని గీసి దానిపై తన భార్య, పిల్లల పేర్లు రాశాడు.

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో మనోజ్ తివారీ తన సెంచరీని పూర్తి చేయగానే, అతను ఆ కాగితాన్ని గాలిలో ఊపుతూ భార్య, పిల్లలపై తన ప్రేమను చాటుకున్నాడు. మనోజ్ తివారీ భార్య సుస్మితా రాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇద్దరు కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమయ్యారు. దాదాపు 7 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

మనోజ్ తివారీ నాకౌట్ దశలో బెంగాల్ తరపున ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు. క్వార్టర్‌ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు, సెమీ-ఫైనల్స్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడానికి ముందు రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేశాడు.