AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: కావ్య మారన్ వద్దంది.. కట్‌చేస్తే.. 120 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్ చేసిన ఆల్ రౌండర్.. ఫీల్ అవ్వాల్సిందే..

Marco Jansen: శ్రీలంకతో జరుగుతోన్న సిరీస్‌లో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ కేవలం 6.5 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. దీంతో 1904లో సాధించిన ఓ రికార్డును బ్రేక్ చేశాడన్నమాట.

IPL 2025: కావ్య మారన్ వద్దంది.. కట్‌చేస్తే.. 120 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్ చేసిన ఆల్ రౌండర్.. ఫీల్ అవ్వాల్సిందే..
Kavya Maran Marco Jansen
Venkata Chari
|

Updated on: Nov 29, 2024 | 3:59 PM

Share

Marco Jansen: డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజున శ్రీలంక బ్యాటింగ్ యూనిట్‌పై విధ్వంసం సృష్టించిన దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ చరిత్ర పుస్తకాల్లో తన పేరును ఎంతో ప్రత్యేకంగా నమోదు చేసుకున్నాడు. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఒత్తిడితో మైదానంలోకి వచ్చినా.. ఆ ఒత్తిడి బౌలింగ్‌లో మాత్రం పడకుండా చూసుకుంది. ఏది ఏమైనప్పటికీ, లెఫ్టార్మ్ పేసర్ తన అద్భుతమైన ఆటతీరుతో కేవలం 6.5 ఓవర్లలో ఏడు వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌటైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో శ్రీలంక తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్ కూడా ప్రపంచంలోని రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.

చరిత్ర సృష్టించిన మార్కాన్ జాన్సెన్..

జాన్సెన్ తన స్పెల్‌లో 6.5 ఓవర్లలో (41) ఏడు వికెట్లు పడగొట్టాడు. పాతుమ్ నిస్సాంక, ఏంజెలో మాథ్యూస్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా, ప్రబాత్ జయసూర్య, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండోలను అవుట్ చేశాడు.

అతని అద్భుతమైన స్పెల్ ద్వారా, జాన్సెన్ అత్యంత వేగంగా ఏడు వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును సమం చేశాడు. 120 ఏళ్లలో ఏడు ఓవర్లలోపు ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో 1904లో ఇంగ్లండ్‌పై 6.5 ఓవర్లలో 28 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు హ్యూ ట్రంబుల్ మాత్రమే దీనిని సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ గురించి మాట్లాడితే, దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 191 పరుగులు చేసినప్పటికీ 149 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టెంబా బావుమా పోరాట పటిమతో 70 పరుగులతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. తొలి రోజు శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటి సెషన్ తర్వాత ఆట సాధ్యం కాలేదు. వార్త రాసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. దీంతో ఇప్పటి వరకు 374 పరుగుల ఆధిక్యంతో దూసుకెళ్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..