AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదంతా నువ్వుచేసుకున్నదే! రోహిత్ శర్మ స్టాండ్ పై ఇండియా వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరుతో స్టాండ్ ఏర్పాటు చేయడం భారత క్రికెట్‌లో ఒక గర్వకారణమైన ఘట్టంగా నిలిచింది. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన చమత్కారమైన, భావోద్వేగ సందేశం అందరినీ ఆకట్టుకుంది. రోహిత్ కుటుంబ సభ్యుల హాజరుతో ఈ వేడుక మరింత భావనాత్మకంగా మారింది. టెస్ట్‌ క్రికెట్ నుంచి రోహిత్ రిటైర్ అయిన కొద్ది నెలలకే ఈ గౌరవం లభించడం అతని కృషికి న్యాయమైన గుర్తింపుగా నిలిచింది.

Video: ఇదంతా నువ్వుచేసుకున్నదే! రోహిత్ శర్మ స్టాండ్ పై ఇండియా వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rohit Sharma Rahul Dravid
Narsimha
|

Updated on: May 18, 2025 | 9:26 AM

Share

భారత క్రికెట్ అభిమానులకు ఇటీవల ఒక సెంటిమెంట్, గర్వాన్ని కలిగించే సంఘటనగా నిలిచింది. రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికిన కొన్ని రోజులకే, అతని సేవలను గుర్తించేందుకు ముంబై వాంఖడే స్టేడియంలో ఓ అరుదైన గౌరవం లభించింది. మే 16న వాంఖడే స్టేడియంలో ఉన్న ఒక స్టాండ్‌కి “రోహిత్ శర్మ స్టాండ్” అనే పేరు పెట్టడం ద్వారా భారత క్రికెట్ అతనికి శాశ్వతమైన అభినందన తెలిపింది. ఇది అతని చిన్ననాటి కలలను సాకారం చేసిన గొప్ప ఘట్టంగా నిలిచింది. ముంబైలోని ప్రతి పిల్లవాడు వాంఖడే మైదానంలో ఆడాలని కలలు కంటాడని, కానీ రోహిత్ ఆ కలను అధిగమించి, తన ఆటతీరు ద్వారా అక్కడ తన పేరు చెక్కించుకున్నాడని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ హృదయపూర్వకంగా వెల్లడించాడు.

ఈ సందర్భంగా ద్రవిడ్ అందించిన అభినందన సందేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సాధారణంగా గంభీరంగా ఉండే ద్రవిడ్ ఈసారి సరదాగా, గుండెతొచ్చిన హృదయంతో మాట్లాడుతూ, “హే రోహిత్, నువ్వు ఆ స్టాండ్స్‌లోకి చాలా సిక్సర్లు కొట్టావు కదా, వాళ్లు ఒక స్టాండ్‌కి నీ పేరు పెట్టాల్సి వచ్చింది. అభినందనలు!” అంటూ చిరునవ్వు పుట్టించేలా ప్రశంసించాడు. అనంతరం, రోహిత్ ఆటలో సృష్టించిన ఐకానిక్ క్షణాలు, ముంబై, భారత క్రికెట్‌కు అందించిన సేవలు ఈ గౌరవానికి న్యాయం చేస్తాయని వివరించాడు. చివరికి తనదైన శైలిలో “ఇంకా రోహిత్ శర్మ స్టాండ్‌ నుంచి సిక్సర్లు చూడాలని ఆశిస్తున్నా.. ఇక ముంబైలో టిక్కెట్లు దొరకకపోతే, నీ దగ్గరే స్టాండ్ ఉంది కదా, ఎవరిని సంప్రదించాలో నాకు తెలుసు!” అంటూ సరదాగా ముగించాడు.

రోహిత్ శర్మకు ఈ గౌరవం లభించడంలో, భారత జట్టు T20 వరల్డ్ కప్‌ను 2024లో గెలుచుకున్న తర్వాత టెస్టుల నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం కీలక ఘట్టం. అప్పటి నుంచి కొన్ని నెలలకే వాంఖడే స్టేడియంలో ఆయనకు ఈ గౌరవం లభించడం ఒక సముచితమైన నివాళిగా నిలిచింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శరద్ పవార్ వంటి రాజకీయ ప్రముఖులు హాజరవడం, ముంబైకి చెందిన అనేక మంది ప్రముఖులు రావడం ఈ వేడుకను మరింత వైభవంగా మార్చింది.

అయితే రోహిత్ శర్మకు మాత్రం ఈ గౌరవంలో అతని కుటుంబం పాలు పంచుకోవడమే నిజమైన ఆనందాన్ని ఇచ్చింది. తన తల్లిదండ్రులు, భార్య, సోదరుడు వంటి అత్యంత సన్నిహితులు ఈ ఘట్టానికి సాక్ష్యమివ్వడం ద్వారా ఈ స్మరణీయ ఘట్టాన్ని మరింత భావోద్వేగపూర్వకంగా మార్చింది. తన కెరీర్‌ను ప్రతిబింబించేలా వాంఖడేలో తన పేరుతో ఒక స్టాండ్ ఉండడం, దేశానికి అతని సేవలకు గౌరవంగా నిలిచే స్థాయికి రోహిత్ చేరినట్లు చెబుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..