RCB IPL 2022 Auction: కోహ్లీ టీంలో చేరిన కీలక ప్లేయర్లు.. ఈ సారి ట్రోఫీ ఆర్సీబీదే అంటోన్న ఫ్యాన్స్..

|

Feb 12, 2022 | 7:08 PM

RCB Players List: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL లీగ్‌లో అత్యంత కీలకమైన జట్టు. అయితే తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తూనే ఉంది.

RCB IPL 2022 Auction: కోహ్లీ టీంలో చేరిన కీలక ప్లేయర్లు.. ఈ సారి ట్రోఫీ ఆర్సీబీదే అంటోన్న ఫ్యాన్స్..
Rcb
Follow us on

IPL 2022 కోసం జరగనున్న మెగా వేలం రోజు రానే వచ్చింది. ఈ ప్రపంచ ప్రసిద్ధ క్రికెట్ లీగ్ వేలం బెంగళూరులో ప్రారంభమైంది. మొదటి రోజున అన్ని జట్లు తమ టీమ్‌ని కొత్తగా సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. సీజన్‌కు ముందు, ప్రతి జట్టుకు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. దీని కింద, ప్రతి జట్టు తమ అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను ఉంచుకుంది. ప్రస్తుతం వేలంలో తమ జట్టును కొత్తగా సిద్ధం చేస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఈసారి జట్టు యజమాని తనకు టైటిల్‌ను పొందగల జట్టును సిద్ధం చేయాలనుకుంటుంది.

ఆర్‌సీబీ చాలా మంది ఆటగాళ్లను రిటైన్ చేయలేదు. ఇందులో యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్ల పేర్లు చేరాయి. దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ రిటైరయ్యాడు. అందుకే అతను ఈ సీజన్‌లో ఆడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌సీబీ పటిష్టంగా ఉండే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రూ.15 కోట్లకు రిటైన్ చేసుకున్న విరాట్ కోహ్లీ పేరు కూడా ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఫ్రాంచైజీ రూ. 11 కోట్లకు తన వద్ద ఉంచుకుంది. అదే సమయంలో, మహ్మద్ సిరాజ్‌ను ఉంచుకోవడానికి ఫ్రాంచైజీ ఏడు కోట్లు ఇచ్చింది. రూ. 57 కోట్లతో ఆర్‌బీసీ వేలంలోకి ప్రవేశించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్ళు:

విరాట్ కోహ్లీ – 15 కోట్లు

గ్లెన్ మాక్స్‌వెల్ – రూ. 11 కోట్లు

మహ్మద్ సిరాజ్ – రూ 7 కోట్లు

ఫాఫ్ డు ప్లెసిస్ – రూ. 7 కోట్లు

హర్షల్ పటేల్ – రూ. 10.75 కోట్లు

వనిందు హసరంగా – రూ 10.75 కోట్లు

దినేష్ కార్తీక్ – రూ. 5.50 కోట్లు

జోష్ హేజిల్‌వుడ్- రూ. 7.75 కోట్లు

Also Read: Gujarat Titans IPL 2022 Auction: గుజరాత్ టైటాన్స్ టీంలో చేరిన ప్లేయర్లు వీరే..!

Ishan Kishan IPL 2022 Auction: వేలంలో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్.. హైదరాబాద్ అడ్డుపడినా తగ్గేదేలే అన్న ముంబై..!