AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Ashwin: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్.. గబ్బాలో షాకింగ్ నిర్ణయం..

Ashwin retirement: ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ గబ్బా టెస్టు ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు పడగొట్టాడు. అలాగే, టెస్టు క్రికెట్‌లో 6 సెంచరీల సాయంతో 3503 పరుగులు చేశాడు.

R Ashwin: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్.. గబ్బాలో షాకింగ్ నిర్ణయం..
Ashwin
Venkata Chari
|

Updated on: Dec 18, 2024 | 11:41 AM

Share

భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటి వరకు భారత టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడిగా పేరుగాంచాడు. ఈ టూర్‌లో అతనికి ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. అడిలైడ్ తర్వాత, అతను గబ్బా టెస్టుకు దూరమయ్యాడు. గబ్బా టెస్టు సందర్భంగా అశ్విన్ టీమిండియా ఆటగాళ్లను కౌగిలించుకుంటూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. అశ్విన్ కూడా హెడ్ కోచ్ గంభీర్‌తో చాలాసేపు మాట్లాడి, ఆపై విలేకరుల సమావేశానికి వచ్చి రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు.

అశ్విన్ అంతర్జాతీయ కెరీర్..

అశ్విన్ టెస్టు క్రికెట్‌లో 106 మ్యాచ్‌లు ఆడి 537 వికెట్లు తీశాడు. అతను తన పేరిట 37 ఐదు వికెట్లు సాధించాడు. మ్యాచ్‌లో 8 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ వన్డేల్లో 156 వికెట్లు కూడా తీశాడు. టీ20లో అశ్విన్ 72 వికెట్లు తీశాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో 765 వికెట్లు సాధించాడు. బ్యాట్స్‌మెన్‌గానూ అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 3503 పరుగులు చేశాడు. అతను మొత్తం 6 టెస్ట్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 8 సెంచరీలు చేశాడు.

అశ్విన్ కెరీర్‌లో కీలక మైలురాళ్లు..

ఆర్ అశ్విన్ తన కెరీర్‌లో ఎన్నో పెద్ద మైలురాళ్లను సాధించాడు. రికార్డులతో పాటు 2011లో వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో భాగస్వామ్యం అయ్యాడు. అలాగే, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు ఆసియా కప్‌ను కూడా అశ్విన్ గెలుచుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను కూడా అశ్విన్ గెలుచుకున్నాడు.

డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్..

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు డ్రాగా ముగిసింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చివరి రోజైన బుధవారం కేవలం 25 ఓవర్లు మాత్రమే వేయగలిగారు. ఆస్ట్రేలియా భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే వర్షం కారణంగా ఒక రోజు ఆట రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..