Team India: సూర్య ఇక బ్యాగ్ సర్దేసుకో.. టీ20 కొత్త కెప్టెన్‌గా దూసుకొస్తోన్న చిచ్చర పిడుగు..!

India New Captain: టీమ్ ఇండియా టీ20 సారథి, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. 2026 ప్రపంచ కప్‌లో జట్టును విజేతగా నిలిపినప్పటికీ, వ్యక్తిగత బ్యాటింగ్ వైఫల్యాలు ఇప్పుడు అతడి కెప్టెన్సీ పదవికే ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, తదుపరి సిరీస్‌లే సూర్య భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

Team India: సూర్య ఇక బ్యాగ్ సర్దేసుకో.. టీ20 కొత్త కెప్టెన్‌గా దూసుకొస్తోన్న చిచ్చర పిడుగు..!
India T20i New Captain

Updated on: Apr 15, 2026 | 4:39 PM

Team India: మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతను 2026 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథంలో నడిపించినప్పటికీ, అతని పేలవమైన బ్యాటింగ్ బీసీసీఐకి తలనొప్పిగా మారింది. టోర్నమెంట్ అంతటా సూర్య ప్రదర్శన సాధారణంగానే ఉంది. కానీ, ఇప్పుడు అతను ఐపీఎల్‌ 2026 లో కూడా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఇదే కొనసాగితే, బీసీసీఐ సూర్య కుమార్ యాదవ్ ను టీ20 కెప్టెన్సీని తొలగించి, మరో ఆటగాడికి అప్పగించే అవకాశం ఉంది.

ఫామ్ లేమితో సతమతమవుతున్న సూర్య..

భారత టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా తన సహజ సిద్ధమైన ఆట తీరును ప్రదర్శించడంలో విఫలమవుతున్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ట్రోఫీ గెలిచినప్పటికీ, ఒక బ్యాట్స్‌మన్‌గా సూర్య ప్రదర్శన అంతంత మాత్రమే. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా అతను పరుగుల వేటలో వెనుకబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు సారథిగా రాణిస్తున్నా, కీలకమైన బ్యాటింగ్ విభాగంలో విఫలమవ్వడం బీసీసీఐ ఎంపిక సభ్యులకు తలనొప్పిగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే, నాయకత్వ బాధ్యతల నుండి అతడిని తప్పించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి.

కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు..

ప్రముఖ వార్తా సంస్థ నివేదికల ప్రకారం, 2028 టీ20 ప్రపంచ కప్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా, ఈ మెగా టోర్నీలకు సూర్యను కెప్టెన్‌గా కొనసాగించడం కష్టమని బోర్డు భావిస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు సూర్యకు ఉన్నప్పటికీ, మైదానంలో ఆటగాడిగా రాణించడం ఇప్పుడు అతనికి అత్యవసరం. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు మాత్రమే ప్రస్తుత నాయకత్వ క్రమం ఉండే అవకాశం ఉండటంతో, భవిష్యత్తు అవసరాల కోసం కొత్త కెప్టెన్‌ను వెతకడంపై కసరత్తు మొదలైంది.

ఇవి కూడా చదవండి

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలే ఆఖరి అవకాశం..

సూర్యకుమార్ యాదవ్‌కు తనను తాను నిరూపించుకోవడానికి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలు చివరి అవకాశాలుగా మారనున్నాయి. ఈ రెండు కీలక సిరీస్‌లలో సూర్య బ్యాట్స్‌మన్‌గా భారీ పరుగులు సాధిస్తేనే అతని కెప్టెన్సీ సురక్షితంగా ఉంటుంది. గంభీర్ సిఫార్సుతో పదవిని దక్కించుకున్న ఈ సీనియర్ ఆటగాడు, ఇంగ్లాండ్ పర్యటనలో జట్టును నడిపించనున్నాడు. ఆ తర్వాత జరిగే సమీక్షా సమావేశంలోనే 2028 వరకు అతని భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది.

రేసులో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్..

ఒకవేళ సూర్యను తప్పిస్తే, ఆ బాధ్యతలు చేపట్టేందుకు అక్షర్ పటేల్ ప్రధమ వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్, బంతితోనూ బ్యాటుతోనూ నిలకడగా రాణిస్తూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. మరోవైపు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించి, పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరితో పాటు దేశవాళీ క్రికెట్ మరియు ఐపీఎల్‌లో అద్భుతమైన నాయకత్వ ప్రతిభ కనబరుస్తున్న ఇషాన్ కిషన్ కూడా రేసులో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us