ముంబై: ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్లే- ఆఫ్ ఆశలను పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ముంబై కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.