MS Dhoni: మ్యాచ్‌లో ఓడినా.. ధోని భయ్యా భారీ రికార్డ్.. ఫ్యాన్స్‌కు మాత్రం పరేషాన్

|

Mar 29, 2025 | 7:35 AM

MS Dhoni Breaks Suresh Raina Record: ఐపీఎల్ 2025లో తమ రెండవ మ్యాచ్ లో, చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 50 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. విశేషమేమిటంటే, చెన్నై 17 సంవత్సరాల తర్వాత తన సొంత మైదానమైన చేపాక్ స్టేడియంలో బెంగళూరుపై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

MS Dhoni: మ్యాచ్‌లో ఓడినా.. ధోని భయ్యా భారీ రికార్డ్.. ఫ్యాన్స్‌కు మాత్రం పరేషాన్
Ipl 2025 Csk Vs Rcb Ms Dhoni
Follow us on

MS Dhoni Breaks Suresh Raina Record: ఎంఎస్ ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ టీం మాత్రమే కాదు.. చెపాక్ మైదానం కూడా. గత 18 సంవత్సరాలుగా భారత క్రికెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న స్టోరీ ఇది. గత కొన్ని సంవత్సరాలుగా, ఇది ఒక భిన్నమైన ప్రేమకథగా మారిపోయింది. ఇక్కడ ధోనిని ఒక్కసారి చూడటం అతని అభిమానులను ఆనందపరుస్తుంది. కానీ, మార్చి 28న ఎవరూ ఊహించనిది జరిగింది. చెపాక్ మైదానంలో చెన్నై తరపున ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఎంఎస్ ధోని సృష్టించాడు. అయితే, అతని పాత సహచరులు, కొంతమంది అభిమానులు అస్సలు సంతోషంగా కనిపించలేదు. అందుకు కారణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

మార్చి 28, శుక్రవారం సాయంత్రం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిని చవిచూసింది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అయితే, ఈ విజయం వారికి ప్రత్యేకమైనది. ఎందుకంటే 2008 తర్వాత బెంగళూరు తమ సొంత మైదానంలో చెన్నైని ఓడించింది. ఈ విజయం చెన్నై అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే, ఈ జట్టు తన సొంత మైదానంలో ఓడిపోవడం అలవాటు లేదు. ముఖ్యంగా బెంగళూరుపై, 2008 తర్వాత మొదటిసారి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అది కూడా రజత్ పాటిదార్ కెప్టెన్సీలో చోటు చేసుకుంది. ఎంతమంది దిగ్గజాలు బెంగలూరు జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టారు. కానీ చెపాక్‌లో చెన్నైని మాత్రం ఓడించలేకపోయారు. 2009 నుంచి 2024 వరకు ఈ చెత్త రికార్డ్ కంటిన్యూ అయింది. కానీ, 2025లో మాత్రం ఈ రికార్డ్‌కు బ్రేకులు పడ్డాయి.

అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై అభిమానులు ఏడాది పొడవునా ఏమి ఎదురుచూస్తున్నారో చూడగలిగారు. ఈ సీజన్‌లో ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో మాజీ జట్టు కెప్టెన్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, అతనికి కేవలం 2 బంతులు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. మ్యాచ్ ముగిసింది. ఈసారి అలా జరగలేదు. ధోని 16 బంతుల పాటు అభిమానులను అలరించాడు. ఈ సమయంలో, ఇన్నింగ్స్ చివరి ఓవర్లో, ధోని 2 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

దీనితో, ఐపీఎల్‌లో చెన్నై తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా ధోని ఖాతాలో ఉంటుంది. చివరి ఓవర్లో కొట్టిన సిక్స్ తో, ధోని చెన్నై జట్టులో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా రికార్డును బద్దలు కొట్టాడు. సురేష్ రైనా 171 ఇన్నింగ్స్‌లలో 4687 పరుగులు చేశాడు. కానీ, ధోని 204 ఇన్నింగ్స్‌లలో 4695 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు. చివరి ఓవర్‌లో షాట్లు, ఈ రికార్డు అభిమానులను సంతోషపరిచాయి. కానీ, చెన్నై జట్టు 50 పరుగుల తేడాతో ఓటమిని ఆపలేకపోయారు. ఇది అభిమానులను కాస్త నిరాశపరిచింది.

ధోని బ్యాటింగ్ చూసి అభిమానులు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారు. కానీ, ధోని కెప్టెన్సీలో ఆడిన అతని మాజీ సహచరులు అస్సలు సంతోషంగా కనిపించలేదు. దీనికి కారణం ధోని బ్యాటింగ్‌కు ఆలస్యంగా రావడమే. 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో CSK కేవలం 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితిలో, జట్టు అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ధోని బ్యాటింగ్‌కు రావడం ప్రయోజనకరంగా ఉండేది. కానీ, రవీంద్ర జడేజా అతని కంటే ముందు వచ్చాడు. ఆ తర్వాత 80 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ పడినప్పుడు, అభిమానులు ధోని ఇప్పుడు వస్తాడని ఆశించారు. కానీ, ఇప్పటికీ అది జరగలేదు. రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. చివరికి, అశ్విన్ 99 పరుగుల వద్ద ఔటయ్యి ఓటమి ఖాయమని తేలిన తర్వాత, ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..