Ind Vs Pak: మనం ఈ మ్యాచ్ చూడలేదు.. అస్సలు ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగలేదు.. ఎవరు అడిగినా ఇదే చెప్పాలి సరేనా..

|

Oct 25, 2021 | 8:48 AM

టీ20 వరల్డ్ కప్‎లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‎లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. టీ20 వరల్డ్ కప్‎ల్లో పాక్‎పై ఇండియాదే పైచేయిగా ఉంది..

Ind Vs Pak: మనం ఈ మ్యాచ్ చూడలేదు.. అస్సలు ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగలేదు.. ఎవరు అడిగినా ఇదే చెప్పాలి సరేనా..
Mim
Follow us on

టీ20 వరల్డ్ కప్‎లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‎లో భారత్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు. టీ20 వరల్డ్ కప్‎ల్లో పాక్‎పై ఇండియాదే పైచేయిగా ఉంది. తప్పకుండా ఇండియా గెలుస్తుందని చాలా మంది అభిమానులు చెప్పారు. కానీ వారి అంచనాలు భారత ఆటగాళ్లు తలకిందులు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‎లో విఫలమై ఓటమిని మూటగట్టుకున్నారు. దీంతో ఈ పరాజయాన్ని ప్రేక్షకులు తట్టుకోలేకపోతున్నారు. భారత ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. కొందరు మిమ్స్ చేస్తూ పోస్టు చేస్తున్నారు.

మనం ఈ మ్యాచ్ చూడలేదు.. అస్సలు ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగలేదు.. ఎవరు అడిగినా ఇదే చెప్పాలి సరేనా.. ఒక మిమ్..

Mim4

గంభీమ్ మామ నువ్వు అంతగా చెప్పాలా ఏంటి.. జాతకాలు చెప్పుకో కానీ.. ఇండియా మ్యాచ్ ప్రిడిక్షన్ చెప్పకు.. అంటూ ఓ మిమ్..

Mim2

ఇది లేదరేగా.. అంటూ ఒక మిమి.. ఇలా రకరకాల మిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mim3

Mim5

అయితే మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 151 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యారు. బౌలర్లు కూడా పూర్తిగా నిరాశపరిచారు. భువనేశ్వర్, షమీ, వరణ్ చక్రవర్తి, బుమ్రా, జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

Read Also.. Ind Vs Pak: పాకిస్తాన్‎ జట్టుపై ప్రశంసలు కురిపించిన పాక్ ప్రధాని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు..