T20 World Cup 2021: టీమిండియా సెమీస్ గండం నుంచి కచ్చితంగా గట్టెక్కుతుంది.. రషీద్ ఖాన్ ఏమన్నాడంటే..?

|

Nov 04, 2021 | 3:38 PM

ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించడం ద్వారా భారత్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ విజయం తర్వాత కూడా కోహ్లీసేన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది.

T20 World Cup 2021: టీమిండియా సెమీస్ గండం నుంచి కచ్చితంగా గట్టెక్కుతుంది.. రషీద్ ఖాన్ ఏమన్నాడంటే..?
T20 World Cup 2021 Rashid Khan
Follow us on

T20 World Cup 2021: ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ టీమ్ టీ20ల్లో మంచి జట్లలో ఒకటిగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఈ జట్టుకు ఉంది. ICC T20 వరల్డ్ కప్-2021లో ఏ జట్టు కూడా ఆఫ్ఘన్‌ను తేలికగా తీసుకోదు. అయితే బుధవారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ ఓటమి గురించి అంతగా నిరాశ చెందలేదు. ఇప్పుడు దాని దృష్టి న్యూజిలాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో విజయం సాధించడంపైనే ఉంది. భారత్ చేతిలో ఘోర పరాజయం తర్వాత, న్యూజిలాండ్‌తో జరిగే T20 ప్రపంచ కప్‌లో తదుపరి మ్యాచ్ తమ జట్టుకు క్వార్టర్ ఫైనల్ లాంటిదని ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అన్నాడు.

సూపర్ 12 దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రెండవ స్థానంలో ఉంది మరియు నెట్ రన్ రేట్ +1.481కు చేరుకుంది. గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకుంది. భారత్‌తో ఓడిపోవడంతో జట్టు జోరుపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నకు రషీద్ ప్రతికూలంగా సమాధానమిచ్చాడు. దీని వల్ల పెద్దగా తేడా వస్తుందని నేను అనుకోను అని ఆయన అన్నారు. భారత్ అత్యుత్తమ జట్లలో ఒకటి అని మనకు తెలుసు. అదే విధంగా ప్రిపేర్ అయ్యి అదే ఆలోచనతో వెళ్తాం. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ మాకు క్వార్టర్‌ ఫైనల్‌ కావచ్చు. గెలిస్తే మంచి రన్ రేట్ ఉన్నందున సెమీఫైనల్ కు చేరుకోవచ్చు. ఆటను ఆస్వాదిస్తేనే మంచి ప్రదర్శన ఇవ్వగలం. మా ఆటను పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తాం’’ అని అన్నారు.

భారత్‌కు కీలక మ్యాచ్‌..
ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ కూడా భారత జట్టుకు కీలకమే. ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు గెలిస్తే భారత్‌కు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు పెరుగుతాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నెట్ రన్ రేట్ మీ మనసులో ఉందా అని అడిగిన ప్రశ్నకు రషీద్ సమాధానమిస్తూ.. ‘ఖచ్చితంగా. మేము కొన్ని వికెట్లు కోల్పోయిన తర్వాత అది మా మనస్సులో ఉంది. అందుకే మేము ఎక్కువ పరుగులు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించాము. మా దృష్టి నిర్ణయాత్మక అంశంగా నిరూపించగల రన్ రేట్‌పైనే ఉంది.

మ్యాచ్ సాగింది ఇలా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. భారత్ తరఫున రోహిత్ శర్మ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 69 పరుగులు చేశాడు. ఇందుకోసం 48 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లతో రెండు సిక్సర్లు బాదాడు. రిషబ్ పంత్ 27 నాటౌట్, హార్దిక్ పాండ్యా 35 నాటౌట్‌గా నిలిచారు. ఈ పటిష్ట లక్ష్యం ముందు ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ నిలవలేకపోయింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. అఫ్ఘనిస్తాన్ టీంలో కరీం జనత్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. కెప్టెన్ మహ్మద్ నబీ 35 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరఫున మహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది.

Also Read: Watch Video: సేమ్ టూ సేమ్.. బుమ్రాను దింపేశాడుగా.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ బౌలింగ్ యాక్షన్ చూశారా? వైరలవుతోన్న వీడియో

IND vs AFG Match Result: టీమిండియా ఘన విజయం.. అర్థ సెంచరీలతో రాణించిన రోహిత్, రాహుల్.. 66 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఓటమి