Dhoni: ‘అక్కడే నా చివరి మ్యాచ్ ఆడతా’.. ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోని సంచలన కామెంట్స్..

|

Oct 06, 2021 | 11:46 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు సారధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే...

Dhoni: అక్కడే నా చివరి మ్యాచ్ ఆడతా.. ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోని సంచలన కామెంట్స్..
1dhoni
Follow us on

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు సారధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్దిరోజులుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా ధోని తప్పుకుంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మెగా ఆక్షన్ జరగనున్న నేపధ్యంలో మహీకి ఇదే చివరి సీజన్ కావొచ్చునని రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక తాజాగా సీఎస్‌కే ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని తన రిటైర్మెంట్ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఈ సీజన్ కూడా తనకు చివరిది కాదని తేల్చి చెప్పేశాడు. ఖచ్చితంగా ఫేర్‌వెల్ మ్యాచ్ ఉంటుందని స్పష్టం చేశాడు.

”ఆగష్టు 15 కంటే మంచి రోజు మరొకటి కనిపించలేదు. అందుకే అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాను. ఫేర్‌వెల్ మ్యాచ్ గురించి కూడా ఆలోచించలేదు” అని ధోని అన్నాడు. అలాగే ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడుతూ.. ”సీఎస్‌కే మ్యాచ్‌లు చూడటానికి మీరు వస్తుంటారు. ఖచ్చితంగా ఇది నా చివరి సీజన్ కాదు. వచ్చే సీజన్‌లో నన్ను చూస్తారు. వీడ్కోలు మ్యాచ్ కూడా చెన్నై స్టేడియంలోనే ఉండొచ్చు” అని పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం యూఏఈలో జరుగుతోన్న ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దూసుకుపోతోంది. ప్లేఆఫ్స్ చేరుకున్న మొదటి టీం చెన్నై కావడం విశేషం.

Also Read:

మొసలిని నమిలి తినేసిన మరో మొసలి.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!