Dhoni vs Kohli: అతన్ని చూడగానే ఏమున్నాడ్రా బాబు అనుకున్నాను.. బాలీవుడ్ బ్యూటీ మనసులో మాట!

బాలీవుడ్ నటి నుష్రత్ భరుచా తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనినని వెల్లడిస్తూ, ఆయన ధైర్యం, ఆటపై ప్రేమ తనను ఆకట్టుకుందని చెప్పింది. కోహ్లీతో పోలిస్తే ధోనీని ఎంచుకోవడంపై అభిమానుల మధ్య చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ధోనీ సవాళ్లను ఎదుర్కొంటున్నాడు, కోహ్లీ మాత్రం అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో నటి కామెంట్స్ క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించాయి.

Dhoni vs Kohli: అతన్ని చూడగానే ఏమున్నాడ్రా బాబు అనుకున్నాను.. బాలీవుడ్ బ్యూటీ మనసులో మాట!
Nushrat Bharucha Favorite Cricketer Dhoni

Updated on: Apr 25, 2025 | 4:36 PM

ఇటు క్రికెట్, అటు బాలీవుడ్ ప్రేమికులను ఉత్సాహానికి గురిచేస్తూ బాలీవుడ్ నటి నుష్రత్ భరుచా తన అభిమాన క్రికెటర్ ఎవరో వెల్లడించారు. శుభంకర్ మిశ్రా యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో ఆమె పాల్గొన్న ఎపిసోడ్‌లో, భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ-ఎంఎస్ ధోని మధ్య ఎంపిక చేసుకోమన్న ప్రశ్నకు ఆమె మొహమాటపడకుండా ధోనిని తన చిరకాల అభిమానిగా ప్రకటించింది. “నేను ఎంఎస్ ధోనిని ఎంచుకుంటాను” అని ఆమె నవ్వుతూ చెప్పిన వెంటనే కోహ్లీ అభిమానుల గుండెల్లో ఓ చిలిపి గాయం అయ్యిందనే చెప్పాలి. భరుచా తన క్రికెట్ అభిమానం ఎలా మొదలైందో వివరిస్తూ, “నిజంగా క్రికెట్‌ అభిమానిగా మారినప్పుడు, ధోనీ తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాగ్రంలో ఉన్నాడు. అప్పుడే నేను ‘క్యా ఆద్మీ హై!’ అనుకున్నాను” అని చెప్పింది. ఆమె అభిమానం కేవలం ధోని ఆట తీరికే కాకుండా, అతని ధీరత్వం, వికెట్‌ కీపింగ్‌లో అతని వేగం, ఆటపై పట్టుకు కూడా అంకితమై ఉందని స్పష్టమైంది.

“ఒక ఆటగాడి స్వభావాన్ని, ప్రవర్తనను మీరు గమనించడానికి మొదలుపెట్టినప్పుడు, నిజంగా అతని వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇదే సమయంలో, ఈ వ్యాఖ్యలు విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య కలకలం రేపాయి, ఎందుకంటే విరాట్ కూడా భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు.

ఇక IPL 2025 నేపథ్యంలో చూస్తే, ఎంఎస్ ధోని సవాలుతో కూడిన సీజన్‌ను ఎదుర్కొంటున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టును నడిపించేందుకు ధోని మళ్లీ కెప్టెన్‌గా బరిలోకి దిగినా, ఆటల పూర్తి భాగాన్ని ఆడలేకపోయాడు. CSK జట్టు బ్యాటింగ్‌లో కూడా మెరుపులు లేక, ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో దిగువన ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం తన అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తూ, RCB తరఫున కీలక విజయాల్లో పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లలో6 విజయాలు సాధించిన RCB సానుకూల స్థితిలో కొనసాగుతోంది.

IPL 2025 మొదటి అర్ధభాగం ముగియడంతో, అభిమానులు ధోనీ-కోహ్లీ మధ్య సాగుతున్న మౌన పోటీని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవైపు కోహ్లీ తన జట్టును గెలుపు వైపు నడిపించేందుకు పోరాడుతున్నాడు, మరోవైపు ధోని తన మాజి ప్రభావాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తున్నాడు. ఈ రెండు క్రికెట్ మేటల కథల్లో కొత్త మలుపులు ఎదురుచూస్తున్నాయి, కానీ నుష్రత్ భరుచా వంటి అభిమానుల హృదయాలలో ఎంఎస్ ధోని “కెప్టెన్ కూల్”గానే కొనసాగుతున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..