దుమ్మురేపిన యువ బ్యాట్స్‌మెన్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. కేవలం 129 బంతుల్లోనే.!

|

Feb 06, 2021 | 11:01 PM

Karnataka Young Batsmen: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండీ.. రోహిత్ శర్మ, డివిలియర్స్, క్రిస్ గేల్, సెహ్వాగ్...

దుమ్మురేపిన యువ బ్యాట్స్‌మెన్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. కేవలం 129 బంతుల్లోనే.!
Follow us on

Karnataka Young Batsmen: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమండీ.. రోహిత్ శర్మ, డివిలియర్స్, క్రిస్ గేల్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలకు సైతం ఇది అందని ద్రాక్ష. కానీ ఓ యువ బ్యాట్స్‌మెన్ మాత్రం చేసి చూపించాడు. అయితే అది అంతర్జాతీయ మ్యాచ్‌ లేదా డొమెస్టిక్ మ్యాచ్ కాదండీ.. ఓ కార్పొరేట్ వన్డే టోర్నమెంట్.. అందుకే ఈ మ్యాచ్‌ను ఐసీసీ గానీ, డొమెస్టిక్ క్రికెట్ బోర్డు గానీ ధృవీకరించలేదు. ఇక అసలు ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ కార్పోరేట్ వన్డే మ్యాచ్‌లో కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల యువ బ్యాట్స్‌‌మెన్ లోవ్నిట్ సిసోడియా కేవలం 129 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ఇన్నింగ్స్ 26 సిక్సర్లు ఉన్నాయి. కాగా, కర్ణాటక క్రికెట్‌లో లవ్నిత్ సిసోడియా అద్భుతంగా రాణిస్తున్నాడు. 2019, 2020 సంవత్సరాలలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక టీం తరపున లవ్నిత్ బరిలోకి దిగాడు. అయితే చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చుకోలేకపోయాడు. ఏది ఏమైనా ఈ యువ కెరటం సాధించిన ఘనతకు పలువురు ప్రశంసలు కురిపించారు.

Also Read:

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు గమనిక.. ఇవే లాస్ట్ డేట్‌లు.. లేదంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ బంద్.!

ఇకపై టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ.! కొత్త నిబంధనలు సిద్దం చేస్తోన్న కేంద్రం..