AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Engl 3rd Test : బుమ్రా తిరిగి వచ్చేస్తున్నాడు.. లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే

భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ లార్డ్స్‌లో జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. జస్ ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వస్తున్న నేపథ్యంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఖాయం. లార్డ్స్ పిచ్ రిపోర్ట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు.

Ind vs Engl 3rd Test : బుమ్రా తిరిగి వచ్చేస్తున్నాడు.. లార్డ్స్‌లో భారత్, ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
Ind Vs Engl 3rd Test
Rakesh
|

Updated on: Jul 08, 2025 | 8:48 PM

Share

Ind vs Engl 3rd Test : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ రెండు మ్యాచ్‌ల తర్వాత 1-1తో సమంగా ఉంది. ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ కోసం టీమిండియా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మూడు కీలక మార్పులు చేసింది. ఇప్పుడు మూడో టెస్ట్‌కు కూడా తుది జట్టులో మార్పులు ఖాయం. ఎందుకంటే, కెప్టెన్ శుభమన్ గిల్ స్వయంగా జస్ ప్రీత్ బుమ్రా లార్డ్స్ టెస్ట్‌కు తిరిగి వస్తున్నాడని ప్రకటించాడు. మరి లార్డ్స్ టెస్ట్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండవచ్చు, పిచ్ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో లార్డ్స్ పిచ్ మొదటి ఫోటో బయటకు వచ్చింది. అందులో పిచ్‌పై చాలా గడ్డి కనిపించింది. ఒక మీడియా రిపోర్ట్ ప్రకారం.. లార్డ్స్ పిచ్‌ను ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా తయారుచేయవచ్చు. సాధారణంగా లార్డ్స్ పిచ్ మ్యాచ్ ప్రారంభంలో పేసర్లకు బాగా సహాయపడుతుంది. అయితే, నాలుగు, ఐదో రోజుల్లో బ్యాటింగ్ చేయడం కొద్దిగా ఈజీ అవుతుంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ కేవలం 310 పరుగులు మాత్రమే.

భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 19 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో ఇంగ్లాండ్ 12 సార్లు గెలిచింది. టీమిండియా 3 సార్లు మాత్రమే విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత్‌కు శుభవార్త ఏమిటంటే.. లార్డ్స్ మైదానంలో గత మూడు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించింది. చివరిసారిగా టీమిండియా ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కేఎల్ రాహుల్ 129 పరుగులతో సెంచరీ చేశాడు. అయితే, భారత్‌కు ప్రతికూలత ఏమిటంటే, కెప్టెన్ శుభమన్ గిల్‌తో సహా చాలా మంది భారత ఆటగాళ్లు ఇప్పటివరకు లార్డ్స్ మైదానంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్,

ఇంగ్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, షోయెబ్ బషీర్,

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..