AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: సజీవంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌ ఆశలు.. రాజస్థాన్‌పై విజయంతో 5వ స్థానానికి పంత్ సేన..

ఐపీఎల్‌ (IPL 2022) చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌(GT) ఫ్లేఆఫ్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ముంబై(MI) ప్లేఆఫ్‌కు దూరం కాగా..

IPL 2022: సజీవంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌ ఆశలు.. రాజస్థాన్‌పై విజయంతో 5వ స్థానానికి పంత్ సేన..
Ipl 2022 Dc Vs Pbks
Srinivas Chekkilla
|

Updated on: May 12, 2022 | 7:41 AM

Share

ఐపీఎల్‌ (IPL 2022) చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌(GT) ఫ్లేఆఫ్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ముంబై(MI) ప్లేఆఫ్‌కు దూరం కాగా చెన్నై దాదాపుగా దూరమైనట్లే కనిపిస్తుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు, డీసీ, కేకేఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, పంజాబ్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుంటే చెన్నైకి ఛాన్స్‌ ఉంటుంది. బుధవారం తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి ప్లేఆఫ్‌ రేస్‌లో నిలిచింది. ఢిల్లీ రాజస్థాన్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్ 4కి చేరువైంది. ఈ సీజన్ మొత్తంలో నిలకడగా ఆడేందుకు పోరాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో చెన్నైపై భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ ప్రదర్శన చూస్తుంటే ఢిల్లీ ప్లేఆఫ్‌కు చేరుకోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ అత్యుత్తమ జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్‌ను సులభంగా ఓడించి బలమైన జట్టుగా ఉంది.

రాజస్థాన్‌పై విజయంతో ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. జట్టు ఇప్పటికీ ఐదో స్థానంలోనే ఉంది. కానీ నాలుగు, మూడు స్థానాల్లో ఉన్న బెంగళూరు, రాజస్థాన్‌లకు దగ్గరగా ఉంది.ఈ రెండు జట్లూ 14-14 పాయింట్లతో ఉన్నాయి. విశేషమేమిటంటే మూడు జట్లూ 12-12 మ్యాచ్‌లు ఆడాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌, బెంగళూరు ముందున్న సవాల్‌ ఏమిటంటే.. అవి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిందే. అలా జరగకుండా రెండు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ఢిల్లీ ముందుంటుంది.

ఢిల్లీ ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ (మే 16), ముంబై ఇండియన్స్ (మే 21)తో తలపడనుంది. ముంబై జట్టు టోర్నీ ఆద్యంతం ఇబ్బంది పడుతుండగా, పంజాబ్ పరిస్థితి కూడా బాగా లేదు. మరోవైపు, ఈ ఓటమితో రాజస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు జట్టు తన చివరి రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడవలసి ఉంది. అదే సమయంలో బెంగళూరు ఇప్పుడు పంజాబ్, గుజరాత్‌లతో తలపడాల్సి ఉంది. అంతే కాదు 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలను కూడా ఈ ఫలితం పెంచింది. సన్‌రైజర్స్ చివరి మూడు మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై, పంజాబ్‌తో ఉన్నాయి. అంటే రాజస్థాన్, బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ఒకదానికొకటి ఢీకొనకపోగా, అలాంటి పరిస్థితుల్లో నాలుగు జట్లకు 16 పాయింట్లు చేరే అవకాశం ఉంది.

Read Aslo.. RR vs DC, IPL 2022: దంచికొట్టిన మార్ష్‌, వార్నర్‌.. RRపై ఢిల్లీ సూపర్‌ విక్టరీ.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం..