IPL 2025: గ్లామర్తో మెరుస్తున్న ముగ్గురు బ్యూటిఫుల్ క్వీన్స్! ఈ సీజన్లో సందడి మాములుగా ఉండదు!
IPL 2025లో మూడుగురు అందమైన యజమానులు క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. SRH యజమాని కావ్య మారన్ ఎనర్జీతో స్టేడియంలో సందడి చేస్తుంటే, ప్రీతి జింతా తన చిరునవ్వుతో PBKS జట్టుకు మద్దతుగా నిలుస్తోంది. KKR సహ యజమాని జూహి చావ్లా, తన హుందాతనంతో అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ ముగ్గురు IPL యజమానులు తమ గ్లామర్, ఉత్సాహంతో ఈ సీజన్ను మరింత రసవత్తరంగా మార్చనున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తన 18వ ఎడిషన్ కోసం గ్రాండ్ రీటర్న్ చేసింది. మెగా వేలం తర్వాత తయారైన 10 జట్లు, బలమైన ఆటగాళ్లతో క్రికెట్ ప్రియులకు మళ్లీ ఉత్కంఠభరితమైన సమరాన్ని అందించనున్నాయి. అయితే, IPL కేవలం క్రికెట్ మాత్రమే కాదు – దీనికి వినోదం, గ్లామర్, ప్రఖ్యాత వ్యక్తుల పాత్ర కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి, కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఫ్రాంచైజీలను యాజమాన్యం చేస్తున్నారు. 2025 సీజన్లో కూడా కొన్ని అందమైన IPL యజమానులు తమ ఉనికిని ప్రదర్శించనున్నారు. ఇప్పుడు, ఈ సీజన్లో అత్యంత అందంగా మెరిసే ముగ్గురు IPL యజమానులను గురించి తెలుసుకుందాం.
1. కావ్య మారన్– సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని
సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లను నిర్వహిస్తూ, IPLలో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
కావ్య మారన్ ప్రస్తుత వయసు 33 సంవత్సరాలు, ఆమె సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. SRH జట్టు వేలం ప్రక్రియల్లో, తుది జట్టు ఎంపికలో, ఫ్రాంచైజీ కీలక నిర్ణయాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటుంది. ఐపీఎల్ మ్యాచ్లలో ఆమె ఎప్పుడూ ఉత్సాహంతో నిండిపోతూ కనిపిస్తుంది. మ్యాచ్ల సమయంలో కావ్య మారన్ రియాక్షన్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సాధారణం.
ఆమె అందం, ఎనర్జీ, స్టేడియంలో ఆత్మవిశ్వాసంతో ఉన్న తీరుకు IPL అభిమానులు ఫిదా అవుతుంటారు. కావ్య మారన్ SRH ఫ్రాంచైజీ యాజమాన్యంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేక క్రికెట్ లీగ్లలో భాగమయ్యారు. IPL 2025లోనూ, ఆమె తన ఉత్సాహం స్టైలిష్ లుక్తో స్టేడియంలో మెరిసిపోతుందనే సందేహం లేదు.
2. ప్రీతి జింతా పంజాబ్ కింగ్స్ (PBKS) యజమాని
2008 నుండి ఐపీఎల్లో గ్లామర్ ఫేస్గా ఉన్న బాలీవుడ్ నటి ప్రీతి, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కో-ఓనర్గా కొనసాగుతోంది. ప్రస్తుతం 50 ఏళ్ల వయస్సున్న ప్రీతి జింతా, తన తళుకుబెట్టిన అందంతో ఇప్పటికీ క్రికెట్ స్టేడియంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. జట్టు విజయాలపైన కాకుండా, ఆటగాళ్లను ఉత్సాహపరిచే విధానంపైన ఆమె ఎక్కువ దృష్టి పెడుతుంది. పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు IPL టైటిల్ గెలవలేదు, కానీ ప్రీతి జింటా మద్దతు ఎప్పుడూ తగ్గలేదు. ప్రతి మ్యాచ్లో స్టాండ్స్లో కూర్చొని తన చిరునవ్వుతో, ఉద్వేగంతో జట్టును ప్రోత్సహిస్తుండడం IPL అభిమానులకు కొత్తేమీ కాదు. IPL 2025లో పంజాబ్ కింగ్స్ కొత్త సాంకేతిక విధానాలతో ముందుకు వెళ్తుండగా, ప్రీతి జింటా మరింత ఉత్సాహంతో కనిపించి, ఆమె ఎనర్జీతో స్టేడియంలో హీట్ పెంచడం ఖాయం.
3. జూహి చావ్లా– కోల్కతా నైట్ రైడర్స్ (KKR) యజమాని
బాలీవుడ్ 90’s స్టార్ జూహి చావ్లా, షారుఖ్ ఖాన్తో కలిసి కోల్కతా నైట్ రైడర్స్ (KKR) సహ యజమానిగా ఉన్నారు. ప్రస్తుతం 57 ఏళ్ల వయస్సున్న జూహి చావ్లా, KKR జట్టు ప్రధాన నిర్ణయాల్లో పాత్ర పోషించింది. ఆమె జట్టు జెర్సీ రంగును నలుపు నుంచి ఊదారంగులోకి మారుస్తూ, ఒక సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను తీసుకువచ్చింది. తన సున్నితమైన చిరునవ్వుతో, అభిమానులను ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉంటుంది.
IPL 2024లో KKR టైటిల్ గెలుచుకున్నప్పుడు, ఆమె ఆనందం అభిమానుల మనసులను గెలుచుకుంది. KKR 2025లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుండటంతో, జూహి చావ్లా తన సంపూర్ణ మద్దతుతో తన జట్టును ప్రోత్సహించనుంది. ఆమె ప్రతి సీజన్లో స్టేడియంలో హుందాగా, సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోవడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..