డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోపంతో రెచ్చిపోయిన కరుణ్‌ నాయర్‌! వామ్మో అంత కోపం ఎందుకు గురు..?

ముంబైతో మ్యాచ్‌లో 89 పరుగులు చేసిన కరుణ్ నాయర్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. పరుగు కోసం తొందరపడి, సహచర ఆటగాడి సూచనను పట్టించుకోకుండా క్రీజు విడిచి వెళ్ళాడు. కోపంతో గ్లోవ్స్, బ్యాట్ విసిరిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోపంతో రెచ్చిపోయిన కరుణ్‌ నాయర్‌! వామ్మో అంత కోపం ఎందుకు గురు..?
Karun Nair

Updated on: Apr 17, 2025 | 6:05 PM

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగులు చేసిన కరుణ్ నాయర్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. తన తప్పుకు తానే బలయ్యాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, టాస్ ఓడిపోయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ శర్మ ఓపెనర్లు అంత గొప్ప స్టార్ట్‌ను ఇవ్వలేదు. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ మూడో ఓవర్‌లో కేవలం 9 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ సమయంలో 3వ స్థానంలో మైదానంలోకి వచ్చిన కరుణ్ నాయర్, లేని పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. స్ట్రైక్‌లో ఉన్న అభిషేక్ పోరెల్ పరుగెత్తవద్దని చెప్పినప్పటికీ కరుణ్ పరుగు కోసం క్రీజును విడిచిపెట్టాడు. పొరెల్‌ సిగ్నల్ చూడకుండానే తొందరపడి క్రీజు వదిలి వెళ్ళిన కరుణ్ నాయర్, మళ్ళీ నాన్-స్ట్రైక్ చేరుకునేలోపు రనౌట్ అయ్యాడు. దాంతో డకౌట్‌గా కరుణ్ నాయర్ పెవిలియన్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. పెవిలియన్ కు చేరుకున్న కరుణ్ నాయర్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లాడు.

రనౌట్‌ అయినందుకు తన కోపాన్ని కూడా వెళ్లగక్కారు. కరుణ్ నాయర్ సహనం కోల్పోయి తన గ్లోవ్స్ బ్యాట్‌ను విసిరేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 188 పరుగులు చేసి మ్యాచ్‌ను టై చేసింది. దీని ప్రకారం, సూపర్ ఓవర్‌కు వెళ్లిన ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌ఆర్‌ 11 పరుగులు చేయగా, సూపర్ ఓవర్‌లోని మొదటి 4 బంతుల్లో 13 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..