AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రెండు గ్రూపులుగా విడిపోయిన ముంబై.. హార్దిక్ ఓవర్ యాక్షన్‌తో ముంబై ఫ్యాన్స్ టెన్షన్‌..

IPL 2024, GT vs MI: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభం కాగానే హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే.. తొలుత గుజరాత్ అభిమానులు అతడ్ని ఆటపట్టించారు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఫీల్డ్‌కి వచ్చినప్పుడు, అతను జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఇన్నింగ్స్‌లోని మొదటి ఓవర్‌ను బౌల్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్ శర్మను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌కి పంపడంతో మాజీలు సైతం విమర్శలు గుప్పించారు.

Video: రెండు గ్రూపులుగా విడిపోయిన ముంబై.. హార్దిక్ ఓవర్ యాక్షన్‌తో ముంబై ఫ్యాన్స్ టెన్షన్‌..
Rohit Hardik Video Ipl 2024
Venkata Chari
|

Updated on: Mar 25, 2024 | 4:45 PM

Share

IPL 2024, GT vs MI: ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో తన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గత చరిత్రను మార్చలేకపోయింది. ఫలితంగా గుజరాత్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో మ్యాచ్ తర్వాత ఒక వీడియో బయటపడింది. ఇందులో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం సరిగా కనిపించకపోవడంతో ఆటగాళ్లు రెండు క్యాంపులుగా విడిపోయారు. ఓటమి తర్వాత రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా భిన్నంగా కనిపించారు. మరోవైపు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్‌లో విభిన్నంగా కనిపించారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వీడియోను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ముంబై జట్టు బహుశా రెండు క్యాంపులుగా చీలిపోయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. చాలా మంది ముంబై అభిమానుల టెన్షన్ కూడా పెరిగింది.

ఆరు పరుగుల తేడాతో ఓడిన ముంబై..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభం కాగానే హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే.. తొలుత గుజరాత్ అభిమానులు అతడ్ని ఆటపట్టించారు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఫీల్డ్‌కి వచ్చినప్పుడు, అతను జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఇన్నింగ్స్‌లోని మొదటి ఓవర్‌ను బౌల్ చేయడంతో అంతా షాక్ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్ శర్మను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌కి పంపడంతో మాజీలు సైతం విమర్శలు గుప్పించారు. వీటన్నింటిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఓటమి తర్వాత మరో వీడియో సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

రెండు క్యాంపులుగా విడిపోయిన రోహిత్, హార్దిక్..

ముంబై ఇండియన్స్ జట్టు చివరి 30 బంతుల్లో 43 పరుగులు సాధించలేక ఆరు పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా డ్రెస్సింగ్ రూమ్‌లో అంటే డగౌట్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ మైదానంలో కొత్త గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడటం కనిపించింది. ఈ వీడియో చూసిన అభిమానులు ముంబై ఇండియన్స్ టీమ్ రెండుగా చీలిపోయిందా అని ఊహాగానాలు చేస్తున్నారు. కాగా, మిగిలిన సీజన్‌లో ముంబై జట్టు ఎలా ఏకమై పునరాగమనం చేస్తుందనే దానిపై చాలా మంది ముంబై అభిమానుల టెన్షన్ కూడా పెరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..