
Indian Premier League: 2024 సంవత్సరం భారత క్రికెట్తో పాటు రాజకీయాలకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే భారతదేశంలో క్రికెట్ అంటే ఐపీఎల్ లీగ్తో పాటు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. IPL 2024, లోక్సభ ఎన్నికల సమయం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. IPL ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో లోక్సభ లేదా సాధారణ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ను భారత్లో కాకుండా వేరే దేశంలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు.
IPL 2009లో కూడా లోక్సభ ఎన్నికలతో IPL లీగ్ జరిగింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా భారతదేశంలో IPL నిర్వహించబడదు. IPL 2009 భారతదేశం నుంచి దక్షిణాఫ్రికాకు మార్చారు. అదేవిధంగా IPL 2024లో కూడా, IPL ను భారతదేశం నుంచి వేరే దేశానికి మార్చడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే IPL చైర్మన్ ఈ చర్చలకు ముగింపు పలికారు.
ఐపీఎల్ 2024 భారత్లో మాత్రమే నిర్వహించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ఠాకూర్ సూచించారు. జాగరణ్ న్యూస్లోని ఒక కథనం ప్రకారం, ఐపీఎల్కు లోక్సభ ఎన్నికలు ఎటువంటి ఆటంకం కాబోవని అరుణ్ ఠాకూర్ అన్నారు. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 లీగ్. ఈ లీగ్ బీసీసీఐకి, దానితో సంబంధం ఉన్న వ్యక్తులందరికీ చాలా డబ్బును సంపాదించి పెడుతుంది. వాస్తవానికి, ఈ ఏడాది ఏప్రిల్, మేలో IPL నిర్వహించేందుకు బోర్డు ప్రపంచ కప్ను వాయిదా వేసింది.
ఈ కారణంగా భారతదేశంలో IPL 2024ని నిర్వహించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే BCCI వేదిక కోసం ప్లాన్ చేయడానికి తగినంత సమయం ఉంటుంది. లోక్సభ ఎన్నికల కారణంగా IPL 2024 భారతదేశంలో నిర్వహించకపోతే , BCCIకి దక్షిణాఫ్రికా, UAE రూపంలో మరో రెండు దేశాల ఎంపికలు ఉంటాయి.
మరిన్ని కీలక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..