Rohit Sharma: ‘రోహిత్ శర్మ బౌలర్ల కెప్టెన్.. ఆయన సారథ్యంలో ఆడనందుకు ఫీల్ అవుతున్నా’

Irfan Pathan: రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి ఫైనల్‌ దిశగా అడుగులు వేస్తోంది. బుధవారం (మే 24) లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2023 ఫైనల్‌కు చేరుకోవడానికి మరో అడుగు దూరంలో నిలిచింది.

Rohit Sharma: రోహిత్ శర్మ బౌలర్ల కెప్టెన్.. ఆయన సారథ్యంలో ఆడనందుకు ఫీల్ అవుతున్నా
Rohit Sharma

Updated on: May 25, 2023 | 8:13 PM

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి ఫైనల్‌ దిశగా అడుగులు వేస్తోంది. బుధవారం (మే 24) లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2023 ఫైనల్‌కు చేరుకోవడానికి మరో అడుగు దూరంలో నిలిచింది. లక్నోపై ముంబై విజయం తర్వాత, భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఫిదా అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడలేకపోయానంటూ విచారం వ్యక్తం చేశాడు.

దీంతో పాటు రోహిత్ శర్మను ఇర్ఫాన్ పఠాన్ బౌలర్ల కెప్టెన్‌గా పిలిచాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మధ్వల్ 5 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ బౌలర్ల కెప్టెన్ అని, అతను యువ ఆటగాళ్లను హ్యాండిల్ చేయడంలో ఆరితేరాడని, అతని కెప్టెన్సీలో నేను కూడా ఆడాలని కోరుకుంటున్నాను అంటూ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్‌ను సూపర్‌స్టార్ మేకింగ్ యూనివర్శిటీగా తీర్చిదిద్దాలి..

ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, “ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, ఆటలో గ్రాడ్యుయేషన్‌తో పాటు ప్లేయర్లను సూపర్ స్టార్‌గా మార్చే విశ్వవిద్యాలయంగా మారింది. ఇందులో కొత్త సూపర్ స్టార్ ఆకాష్ మాధ్వల్. అతని క్రెడిట్ మొత్తం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఎలిమినేటర్‌లో లక్నోపై 81 పరుగుల తేడాతో విజయం..

ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన లక్నో జట్టు 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది.

ముంబై ఫాస్ట్ బౌలర్ ఆకాష్ మధ్వల్ అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నో జట్టులో సగం మందిని పెవిలియన్ చేర్చాడు. ఆకాష్ 3.3 ఓవర్లలో 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అతను లక్నోకు చెందిన ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోని, నికోలస్ పురాన్, రవి బిష్ణోయ్, మోహిసన్ ఖాన్‌లను తన బాధితులుగా మార్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..