India Vs Australia 2020: వర్షం కారణంగా నాలుగో టెస్ట్‌కి అంతరాయం.. నిలిచిపోయిన ఇండియా బ్యాటింగ్..

|

Jan 16, 2021 | 11:34 AM

India Vs Australia 2020: బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగోటెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌కి వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది.

India Vs Australia 2020: వర్షం కారణంగా నాలుగో టెస్ట్‌కి అంతరాయం.. నిలిచిపోయిన ఇండియా బ్యాటింగ్..
Follow us on

India Vs Australia 2020: బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగోటెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌కి వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. దీంతో టీం ఇండియా బ్యాటింగ్ నిలిచిపోయింది. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి భారత్‌ 62/2తో నిలవగా, ఛెతేశ్వర్‌ పుజారా(8), అజింక్య రహానె(2) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఆదిలోనే శుభ్‌మన్‌ గిల్‌(7) వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో గిల్‌ స్మిత్‌ చేతికి చిక్కాడు. ఆపై రోహిత్‌(44; 74 బంతుల్లో 6×4), పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. అర్ధశతకానికి చేరువైన హిట్‌మ్యాన్‌ను లైయన్‌ బోల్తా కొట్టించాడు. ఊరించే బంతి వేయడంతో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి మిచెల్‌ స్టార్క్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆపై రహానె క్రీజులోకి రాగా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. టీ విరామానికి భారత్‌ 62/2తో నిలిచింది.

India Vs Australia 2020: దూకుడు తగ్గించిన టీమిండియా.. పెవిలియన్ చేరిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌లు..

India Vs Australia 2020: టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ విలవిల.. 191 పరుగులకు ఆలౌట్.. ఆధిక్యం భారత్‌దే..