Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!

Anmolpreet Singh Fastest Century: భారత క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక యువ బ్యాటర్ పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సునామీ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను నిస్సహాయులను చేస్తూ మైదానంలో పరుగుల వరద పారించాడు. ఇందులో ఈ యంగ్ ప్లేయర్ కేవలం 11 ఫోర్లు, 8 సెక్సులతో చెలరేగిపోయాడు.

Video: 11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత.. వన్డే హిస్టరీకే దడ పుట్టించిన మనోడు..!
Anmolpreet Singh Fastest Century

Updated on: May 06, 2026 | 3:59 PM

Anmolpreet Singh Fastest Century: భారత దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడే అన్మోల్‌ప్రీత్ సింగ్ ఈ చారిత్రాత్మక ఘనతను సాధించాడు. అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఇతడు, లిస్ట్-ఏ క్రికెట్ (50 ఓవర్ల ఫార్మాట్) చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇతని బ్యాటింగ్ శైలి చూస్తుంటే మైదానంలో బంతి ఎటు వెళ్తుందో తెలియక బౌలర్లు గంటల తరబడి తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఇన్నింగ్స్‌లో అన్మోల్‌ప్రీత్ ఏకంగా 255.55 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం.

35 బంతుల్లోనే సరికొత్త చరిత్ర..

2024, డిసెంబర్ 21న జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్మోల్‌ప్రీత్ సింగ్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకున్న ఇతడు, మొత్తంగా 45 బంతులు ఎదుర్కొని 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇది భారత దేశవాళీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో నమోదైన అత్యంత వేగవంతమైన సెంచరీగా అధికారికంగా నమోదైంది.

బౌలర్ల నిస్సహాయత – పంజాబ్ ఘనవిజయం..

ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ బౌలర్ల ధాటికి అరుణాచల్ ప్రదేశ్ జట్టు 48.4 ఓవర్లలో కేవలం 164 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 165 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు అన్మోల్‌ప్రీత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పంజాబ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 223 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అన్మోల్‌ప్రీత్ సింగ్‌ను ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ పురస్కారం వరించింది.

పాత రికార్డులన్నీ కనుమరుగు..

అన్మోల్‌ప్రీత్ కంటే ముందు లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన భారతీయ క్రికెటర్‌గా యూసుఫ్ పఠాన్ పేరిట రికార్డు ఉండేది. పఠాన్ 40 బంతుల్లో సెంచరీ సాధించగా, ఇప్పుడు ఆ రికార్డును అన్మోల్‌ప్రీత్ అధిగమించాడు. ఇక అంతర్జాతీయ వన్డేల విషయానికి వస్తే, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 52 బంతుల్లో (ఆస్ట్రేలియాపై 2013లో) సెంచరీ బాదిన రికార్డు ఉంది. అయితే దేశవాళీ రికార్డుల్లో మాత్రం అన్మోల్‌ప్రీత్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు.

ప్రపంచ రికార్డులతో పోలిక..

ప్రపంచవ్యాప్తంగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ పేరిట ఉంది. ఇతడు 2023లో కేవలం 29 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. అదేవిధంగా అంతర్జాతీయ వన్డేల్లో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట 31 బంతుల సెంచరీ రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. 2015లో వెస్టిండీస్‌పై డివిలియర్స్ కేవలం 44 బంతుల్లో 149 పరుగులు చేసి చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు.

భారత యువ క్రికెటర్లు దేశవాళీ టోర్నమెంట్లలో ఇలాంటి అసాధారణ ప్రదర్శనలు చేయడం భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకం. అన్మోల్‌ప్రీత్ సింగ్ సృష్టించిన ఈ 35 బంతుల సెంచరీ రికార్డు రాబోయే కాలంలో ఎంతమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ‘పంజాబ్ పులి’ ఇన్నింగ్స్ గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us