
దుబాయ్ గ్రౌండ్లో జరిగింది ఆట కాదు.. ఒక యుద్ధం. ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపు.. క్రికెట్ గ్రౌండ్లో గానీ జరుగుతోందా అన్నంతగా హీట్ పుట్టించింది ఫైనల్ మ్యాచ్. ‘ఆరు జెట్ ఫ్లైట్స్’ కూల్చేశాం అంటూ చేతులు పైకెత్తి చూపాడొక మూర్ఖుడు… పేరు రవూఫ్. మనోళ్లు ఊరుకుంటారా. వికెట్ తీయడం ఆలస్యం ‘నీది కూలింది చూసుకో’ అంటూ ఎక్కడ మంట పెట్టాలో అక్కడ పెట్టారు. ఇలాంటి ఎమోషనల్ గేమ్.. బహుశా క్రికెట్ హిస్టరీలో ఏ దేశాల మధ్య జరిగి ఉండదు. ఆసియా కప్లో టీమిండియా ఆడుతోందనగానే గరం గరం అయ్యారు మొదట్లో. 8 టీమ్లతో జరిగే సాధారణ ఆసియా కప్ అది. పైగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ను పాకిస్తాన్ ఆడిస్తోంది. ఒకవిధంగా పాకిస్తాన్ కండక్ట్ చేస్తున్న సిరీస్ ఇది. అందులోనూ ఫామ్లో ఉన్న జట్టు ఒక్కటీ లేదు. వీటన్నిటికీ మించి పహల్గామ్ దాడితో భారత స్త్రీల సౌభాగ్యాన్ని చెరిపేసిన ఉగ్రవాదులకు అండగా వున్న పాకిస్తాన్తో ఆడాలి. ‘గెలిస్తే మాత్రం.. అవసరమా ఈ సిరీస్ మనకి’ అని విమర్శించిన వాళ్లూ లేకపోలేదు. అందుకే, ఆసియా కప్లో పాకిస్తాన్తో ఆడిన మొదటి మ్యాచ్కు అసలు టికెట్లు కూడా అమ్ముడుపోలేదు. ఒక్క సెలబ్రిటీ దుబాయ్ వెళ్తే ఒట్టు. క్రికెట్ భారతీయుల నరనరాన ఉందేమో. పాక్తో మ్యాచ్ అంటే రక్తం మరుగుతుందేమో. కాని, అన్నిటికీ మించి దేశభక్తే అల్టిమేట్. అందుకే, ఆసియా కప్లో టీమిండియా ఆడొద్దంటూ ఎన్నెన్ని నిరసనలు చేశారో. సరే.. ఎవరు ఔనన్నా,...