
అభిషేక్ శర్మ 11వ ఓవర్ మొదటి బంతికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్లో ఇది అతనికి తొలి అర్ధ సెంచరీ. ఆతర్వాత 55 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (50*) హాఫ్ సెంచరీ సాధించాడు. సికందర్ రజా వేసిన 10.1వ ఓవర్లో సింగిల్తో అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లో అర్ధశతకం సాధించిన అభిషేక్.. అంతకుముందు 10వ ఓవర్లో బ్రియాన్ బెనెట్ 10 పరుగులు చేశాడు.
స్పిన్నర్లను ఆచితూచి ఆడుతున్నారు ఇషాన్ కిషన్ (26*), అభిషేక్ శర్మ (41*). ప్రస్తుతం ఇద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు 9 ఓవర్లకు 99/1గా ఉంది.
టీమిండియా బౌండరీలతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టపోయి 80 పరుగులు చేసింది టీమిండియా. ప్రస్తుతం ఇషాన్ కిషన్(15), అభిషేక్ శర్మ(33) క్రీజులో ఉన్నారు.
సంజూ శాంసన్ (24 పరుగులు, 2 సిక్స్లు, 1 ఫోర్) మరోసారి నిరాశపరిచాడు. లక్కీ ఛాన్స్ దొరికితే పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాాడు. దీంతో భారత జట్టు 3.4 ఓవర్లలో 48 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది.
3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 46 పరుగులు చేసింది. శాంసన్ 23, అభిషేక్ 16 పరుగులతో నిలిచారు.
తొలి ఓవర్ ముగిసే సరికి భారత జట్టు 13 పరుగులు చేసింది. శాంసన్ 9, అభిషేక్ 0 పరుగులతో నిలిచారు.
టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు తరపున అభిషేక్ శర్మ, శాంసన్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
గత మ్యాచ్ నుంచి ప్లేయింగ్ XIలో టీమిండియా 2 మార్పులు చేసింది. అక్షర్ పటేల్, సంజు శాంసన్ తిరిగి వస్తున్నారు. రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ లను బెంచ్ లోనే ఉంచారు.
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.
టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.
సౌతాఫ్రికా జట్టు నుంచి టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. వెస్టిండీస్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా.. భారత జట్టుకు సెమీస్ ఆశలకు ఊపిరిపోసింది.
భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్లు ఆడగా, టీం ఇండియా 10 మ్యాచ్లు గెలిచింది. జింబాబ్వే కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. ఈ రెండు జట్లు గతంలో 2022లో జరిగిన టీ20 ప్రపంచ కప్లో తలపడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ అజేయంగా అర్ధ సెంచరీతో భారత్ విజయం సాధించింది.
జింబాబ్వే జట్టు భారతదేశంలో భారత్తో ఇప్పటివరకు ఒక్క టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ, భారతదేశంలో 24 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. వాటిలో 19 వన్డేలు, ఐదు టెస్టులు ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్లో 6వ సూపర్ 8 మ్యాచ్ ఈరోజు భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మొదలైంది.
చేపాక్ పిచ్ సాధారణంగా నెమ్మదిగా, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈసారి కొత్త పిచ్ను సిద్ధం చేశారు. ఈసారి, మంచి బౌన్స్ ఉంది. పరుగుల వరద పారనుందని తెలుస్తోంది. ఈ ప్రపంచ కప్లో ఇప్పటివరకు ఇక్కడ ఆరు మ్యాచ్లు జరిగాయి. అన్నీ 170+ స్కోర్లను నమోదు చేశాయి.
ఇక్కడ ఇప్పటివరకు తొమ్మిది టీ20 మ్యాచ్లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది, ఛేజింగ్ చేసిన జట్టు ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. ఈ ప్రపంచ కప్లో కెనడాపై ఆఫ్ఘనిస్తాన్ చేసిన 200/4 ఇక్కడ అత్యధిక జట్టు స్కోరు. ఇక్కడ సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 182.
భారత జట్టు ఈ మైదానంలో మూడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. వాటిలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లలో రెండింటిలో గెలిచి, ఒక దానిలో ఓడిపోయింది. జింబాబ్వే ఇక్కడ తొలిసారి ఆడనుంది.
గురువారం చెన్నైలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం చాలావరకు స్పష్టంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని అంచనా. వర్షం ఉండదు.
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..