
భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ నేటినుంచి మొదలైంది. కేప్టౌన్లోని న్యూలాండ్స్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ 6 వికెట్లతో బ్యాటర్లకు చుక్కలుచూపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండయా వార్తలు రాసే సమయానికి 10 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసింది. రోహిత్ 38, గిల్ 6 పరుగులతో క్రీజులో నిలిచారు. యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కాగా, ఈ మ్యాచ్లో ఎన్నో రికార్డులు సృష్టించవచ్చు. ఈ రికార్డుల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కూడా చేరే అవకాశం ఉంది.
ఎందుకంటే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా-దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మొత్తం 7 రికార్డులు లిఖించే అవకాశం ఉంది. ఆ రికార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, టోనీ డిజార్జ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వేరియన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, నాండ్రే బెర్గర్.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ , జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్.
దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, నాండ్రే బెర్గర్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెన్, టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్గిడి, కీగన్ పీటర్సన్, హంజా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..