AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs NZ 2nd ODI : టాస్ గెలిచిన కివీస్..రంగంలోకి తెలుగు కుర్రాడు..సిరీస్ పట్టేసేందుకు గిల్ సేన రెడీ!

India vs NZ 2nd ODI : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రాజ్‌కోట్‌లో రెండో వన్డే ప్రారంభమైంది. మొదటి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని చూస్తోంది.

India vs NZ 2nd ODI : టాస్ గెలిచిన కివీస్..రంగంలోకి తెలుగు కుర్రాడు..సిరీస్ పట్టేసేందుకు గిల్ సేన రెడీ!
India Vs Nz 2nd Odi
Rakesh
|

Updated on: Jan 14, 2026 | 1:24 PM

Share

India vs NZ 2nd ODI : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రాజ్‌కోట్‌లో రెండో వన్డే ప్రారంభమైంది. మొదటి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ కీలక పోరులో న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అంటే భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై రోహిత్, గిల్, కోహ్లీలు పరుగుల వరద పారిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్ నుంచి తప్పుకోవడంతో, అతని స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. ఆల్ రౌండర్ కోటాలో నితీష్ జట్టుకు బలాన్నిస్తాడని కోచ్ గంభీర్ నమ్మకంగా ఉన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టులో కూడా ఒక మార్పు చోటుచేసుకుంది. ఆదిత్య అశోక్ స్థానంలో జేడన్ లెనాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు.

రాజ్‌కోట్ స్టేడియంలో టీమిండియాకు అంత గొప్ప రికార్డు లేదు. ఇక్కడ ఆడిన 4 వన్డేల్లో భారత్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గిల్ సారథ్యంలోని యువ భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. స్వదేశంలో వరుసగా 8వ సిరీస్ విజయంపై కన్నేసిన టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 322గా ఉన్న ఈ మైదానంలో, భారత్ భారీ స్కోరు సాధిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు.

తొలి వన్డేలో 93 పరుగుల వద్ద అవుట్ అయి తన 54వ వన్డే సెంచరీని చేజార్చుకున్న విరాట్ కోహ్లీపై నేడు అందరి కళ్లు ఉన్నాయి. కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈరోజు రాజ్‌కోట్ మైదానంలో సెంచరీ బాదుతాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రోహిత్ శర్మ కూడా శుభారంభం ఇస్తే, మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కె.ఎల్ రాహుల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించడానికి సిద్ధంగా ఉన్నారు.

తుది జట్లు :

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, జేడన్ లెనోక్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్.