T20 WC 2024 Semi Finals: సెమీస్‌లో టీమిండియాతో తలపడే జట్టు ఇదే.. 2022 సీన్ రిపీటైతే రోహిత్ సేనకు ఓటమే..

Indian Team Semi-Final Match vs England: టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత జట్టు దాదాపు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై భారత జట్టు గెలిస్తే లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేసినా, భారత జట్టు అధికారికంగా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఓవరాల్‌గా ఇప్పటివరకు గ్రూప్ 2 నుంచి రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. కాగా గ్రూప్-1లో ఏ జట్టు కూడా అధికారికంగా సెమీఫైనల్‌లోకి ప్రవేశించలేదు. అయితే గ్రూప్-1 నుంచి టీమ్ ఇండియా చివరి 4కి వెళ్లడం దాదాపు ఖాయం.

T20 WC 2024 Semi Finals: సెమీస్‌లో టీమిండియాతో తలపడే జట్టు ఇదే.. 2022 సీన్ రిపీటైతే రోహిత్ సేనకు ఓటమే..
Ind Vs Eng Vs Sa Semi Fianl

Updated on: Jun 24, 2024 | 12:50 PM

Indian Team Semi-Final Match vs England: టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత జట్టు దాదాపు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై భారత జట్టు గెలిస్తే లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేసినా, భారత జట్టు అధికారికంగా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.

ఓవరాల్‌గా ఇప్పటివరకు గ్రూప్ 2 నుంచి రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. కాగా గ్రూప్-1లో ఏ జట్టు కూడా అధికారికంగా సెమీఫైనల్‌లోకి ప్రవేశించలేదు. అయితే గ్రూప్-1 నుంచి టీమ్ ఇండియా చివరి 4కి వెళ్లడం దాదాపు ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో సెమీఫైనల్‌లో టీమిండియా ఎవరిని ఎదుర్కొంటుంది అనేది భారత అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఫైనల్స్‌కు చేరుకోవడానికి రోహిత్ సేన ఏ జట్టుతో పోటీపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య పోరు..

ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే తమ గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ రద్దయినా.. టీమ్ ఇండియా తన గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్‌తో భారత జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. వాస్తవానికి గ్రూప్-1లోని అగ్రశ్రేణి జట్టు గ్రూప్-2లో రెండో ర్యాంక్‌తో తలపడాలని, గ్రూప్-2లోని అగ్రశ్రేణి జట్టు గ్రూప్-1లో తలపడాలని ఇప్పటికే నిర్ణయించారు.

గ్రూప్ 1 నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు చేరుకుంటే.. భారత్‌ ఇంగ్లండ్‌తో, దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో తలపడనున్నాయి. ఓవరాల్‌గా సెమీఫైనల్స్‌లో పెద్ద జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొననుంది.

జూన్ 27న భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 28న ఫైనల్ జరగనుంది. ఇంగ్లండ్ చివరిసారిగా సెమీ ఫైనల్స్‌లో టీమిండియాను ఓడించింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సువర్ణావకాశం భారత్‌కు దక్కింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us