
IND vs ENG 1st Test Day 4: నాటింగ్హామ్లో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంది. టీమిండియా విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 52/1తో నిలిచింది. రోహిత్ శర్మ(12), పుజారా(12) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు కేఎల్ రాహుల్(26) ధాటిగా ఆడుతూ బ్రాడ్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 183 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ 5, అండర్సన్ 4 వికెట్లతో పడొట్టారు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 303 పరుగులకు ఆలౌటైంది. షమి వేసిన 85.5 ఓవర్కు రాబిన్సన్(15) చివరి వికెట్గా వెనుదిరిగాడు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు.. సిరాజ్, శార్ధూల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా షమి ఒక వికెట్ తీశాడు. జో రూట్ (109) శతకంతో చెలరేగాడు.
14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 52 పరుగులు చేసింది. రాహుల్ (26) తొలి వికెట్గా వెనుదిరిగాడు. రోహిత్(12), పుజారా(12)జోడీ పరుగులు రాబడుతూ నిలకడగా ఆడుతున్నారు.
టీమిండియా రెండో ఇన్నింగ్స్లో తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్(26) స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. బంతి బ్యాట్ ఎడ్జ్కు తీసుకొని కీపర్ చేతుల్లో పడటంతో 34 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో రోహిత్ (9), పుజారా(4) పరుగులతో ఆడుతున్నారు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 303 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ తొలి టెస్టులో గెలవాలంటే 209 పరుగులు సాధించాల్సి ఉంది. బౌలర్లలో బుమ్రా ఐదు.. సిరాజ్, శార్ధూల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా షమి ఒక వికెట్ తీశాడు. జో రూట్ (109) శతకంతో చెలరేగాడు.
బుమ్రా బౌలింగ్లో బ్రాడ్ తొమ్మిదవ వికెట్గా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 303/9 పరుగుల వద్ద ఉంది. అలాగే ఆధిక్యం 208 పరుగులకు పెరిగింది.
ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. జో రూట్ 107 పరుగులు ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 274 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ తీసుకున్నాడు. క్రీజులోకి ఓలి రాబిన్ సన్ వచ్చాడు. ఇంగ్లాండ్ భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యం సాధించింది.
1st Test. 80.6: WICKET! J Root (109) is out, c Rishabh Pant b Jasprit Bumrah, 274/7 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ 6 వికెట్లు నష్టపోయి 270 పరుగులు దాటింది. భారత్ కంటే 175 పరుగుల ఆధిక్యం సాధించింది. మరోవైపు కెప్టెన్ జో రూట్ సెంచరీ సాధించి ఆట కొనసాగిస్తున్నాడు. అతడికి శామ్ కుర్రామ్ 22 పరుగులతో చక్కటి సహకారం అందిస్తున్నాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్థుల్ ఠాకూర్ రెండేసి వికెట్లు సాధించారు.
ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ జో రూట్ సెంచరీ చేశాడు. 155 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. జో రూట్ సెంచరీతో ఇంగ్లాండ్ భారీ దిశగా వెళుతుంది. వరుసగా వికెట్లు పడుతున్నా రూట్ తన సహజ సిద్దమైన ఆటన ప్రదర్శించాడు. దీంతో ఇంగ్లాండ్ భారత్ కంటే 157 పరుగుల ఆధిక్యం సాధించింది. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ నిలకడగా ఆడుతూ కెప్టెన్ రూట్కి సహకరిస్తూ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. జోస్ బట్లర్ 17 పరుగులు ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 237 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ జో రూట్96 పరుగులతో సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. శార్దుల్ ఠాకూర్ బట్లర్ని ఔట్ చేశాడు. శ్యామ్ కుర్రాన్ క్రీజులోకి అడుగుపెట్టాడు.
ఇంగ్లాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. డానియల్ లారెన్స్ 25 పరుగులు ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 211 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ జో రూట్90 పరుగులతో సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. వరుసగా వికెట్లు లభించడంతో భారత బౌలర్లలో ఆనందం వెల్లివిరిసింది. జోస్ బట్లర్ క్రీజులోకి వచ్చాడు. ఠాకూర్ బౌలింగ్లో లారెన్స్ ఎల్బీగా వెనుదిరిగాడు.
LBW! ☝️@imShard strikes to get Daniel Lawrence out. ? ?#TeamIndia #ENGvIND
England lose their fifth wicket.
Follow the match ? https://t.co/TrX6JMzP9A pic.twitter.com/xs2mZjDssd
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు దాటింది. కెప్టెన్ జో రూట్ 90 పరుగులతో కొనసాగుతున్నాడు. డానియల్ లారెన్స్ 17 పరుగులతో అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. భారత్ కంటే ఇంగ్లాండ్ ప్రస్తుతం 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు సాధించారు.
1st Test. 63.5: M Shami to D Lawrence (14), 4 runs, 199/4 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. జానీ బెయర్ స్ట్రో 30 పరుగులు ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 177 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ జో రూట్ 83 పరుగులతో సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. చాలా సమయం తర్వాత వికెట్ లభించడంతో భారత బౌలర్లలో ఆనందం వెల్లివిరిసింది. డానియల్ లారెన్స్ క్రీజులోకి వచ్చాడు. మహ్మద్ సిరాజ్కి మరో వికెట్ దక్కింది.
England 4⃣ down! ? ?@mdsirajofficial dismisses Jonny Bairstow to scalp his 2nd wicket. ? ? #TeamIndia #ENGvIND
Follow the match ? https://t.co/TrX6JMzP9A pic.twitter.com/tyuXwg0bw2
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు దాటింది. కెప్టెన్ జో రూట్ 76 పరుగులతో కొనసాగుతున్నాడు. జానీ బెయర్ స్ట్రో 12 పరుగులతో అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. భారత్ కంటే ఇంగ్లాండ్ ప్రస్తుతం 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ సాధించారు.
1st Test. 50.1: M Shami to J Bairstow (12), 4 runs, 152/3 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. సిబ్లీ 28 పరుగులు ఔట్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ పట్టాడు. దీంతో ఇంగ్లాండ్ 135 పరుగుల వద్ద 3 వికెట్ కోల్పోయింది. మరోవైపు కెప్టెన్ జో రూట్ సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. చాలా సమయం తర్వాత వికెట్ లభించడంతో భారత బౌలర్లలో ఆనందం వెల్లివిరిసింది. జానీ బెయర్ స్ట్రో క్రీజులోకి వచ్చాడు.
1st Test. 45.5: WICKET! D Sibley (28) is out, c Rishabh Pant b Jasprit Bumrah, 135/3 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 7, 2021
టోక్యో ఒలింపిక్స్లో భారతదేశానికి స్వర్ణ పతకం దక్కింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. 87.58 మీటర్ల త్రో విసిరి పతకం ఖాయం చేశాడు. అథ్లెటిక్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 2008 సంవత్సరంలో అభినవ్ బింద్రా దేశానికి మొదటి వ్యక్తిగత పతకాన్ని సాధించారు. బంగారు పథకం సాధించడంతో నీరజ్ చోప్రా గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి.
H. I. S. T. O. R. I. C! ?
A proud moment for the nation as Neeraj Chopra wins India’s first gold medal at @Tokyo2020 . ?? ?
Take a bow, @Neeraj_chopra1! ? ?@IndiaSports | @Media_SAI | @WeAreTeamIndia pic.twitter.com/o3HG31c754
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ లంచ్ సమయానికి 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 56 పరుగులు, సిబ్లే 27 పరుగులు చేశారు. మూడో వికెట్కి వీరిద్దరు 73 పరుగుల భాగస్వామ్యం చేశారు. మొదట్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు తర్వాత ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. భారత్ కంటే ఇంగ్లాండ్ ప్రస్తుతం 24 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Lunch on Day 4 of the 1st Test.
England 183 & 119/2, lead #TeamIndia (278) by 24 runs.
Scorecard – https://t.co/TrX6JMiei2 #ENGvIND pic.twitter.com/XA6rnGUu1c
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ హాఫ్ సెంచరీ చేశాడు. 71 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. దీంతో 2 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 118 పరుగులు చేసింది. మరోవైపు భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.
1st Test. 37.3: M Shami to J Root (51), 4 runs, 114/2 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ 43 పరుగులు, డామ్ సిబ్లీ 25 పరుగులు నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరు మూడో వికెట్కి 58 పరుగులు జోడించారు. మరోవైపు భారత బౌలర్లు వికెట్ల కోసం చెమటోడ్చుతున్నారు.
1st Test. 34.1: R Jadeja to J Root (40), 4 runs, 101/2 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ధాటిగా ఆడుతున్నాడు. మరో వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆట కొనసాగిస్తున్నారు. 37 బంతుల్లో 6 ఫోర్లతో 30 పరుగులు చేశాడు. మరోవైపు డామ్ సిబ్లీ 22 పరుగులు చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.
1st Test. 26.4: M Shami to J Root (29), 4 runs, 80/2 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో డామ్ సిబ్లీ 17 పరుగులు, జో రూట్ 4 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. ఇండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బూమ్రా చెరో వికెట్ సాధించారు.
ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో జాక్ క్రాలే 6 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.
Beautiful bowling by Bumrah as Crawley is caught behind for 6.
Live – https://t.co/TrX6JMiei2 #ENGvIND pic.twitter.com/yiwnPmLVZV
— BCCI (@BCCI) August 7, 2021
ఇంగ్లాండ్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్ 18 పరుగులు ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో రిషబ్ పంత్ చక్కటి క్యాచ్ పట్టాడు.
1st Test. 15.1: WICKET! R Burns (18) is out, c Rishabh Pant b Mohammed Siraj, 37/1 https://t.co/TrX6JMiei2 #ENGvIND
— BCCI (@BCCI) August 7, 2021
భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ 4వ రోజు ఆట కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్లో భాగంగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రోరీ బర్న్స్ 18 పరుగులు, డామ్ సిబ్లీ 13 పరుగులు ఆడుతున్నారు.
భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకి వర్షం అంతరాయం కలిగిస్తోంది. అయితే 4వ రోజు ఆట మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది.
Hello and welcome to Day 4 of the 1st Test. #TeamIndia have a 70-run overnight lead and will look to make inroads early on.
Live action coming up shortly. Stay tuned! #ENGvIND pic.twitter.com/sdBo77k4Bk
— BCCI (@BCCI) August 7, 2021