AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్.. కీలక మార్పులతో బరిలోకి భారత జట్టు..?

India vs Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా, గురువారం జరిగే ఆఖరి పోరుకు సిద్ధమవుతోంది. సిరీస్ సొంతం కావడంతో తుది జట్టులో బెంచ్ బలాన్ని పరీక్షించే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ ప్లేయర్లకు తుది జట్టులో అవకాశం కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి.

IND vs AFG: ఆఫ్ఘాన్‌తో చివరి మ్యాచ్.. ఆ ముగ్గురు ఔట్.. కీలక మార్పులతో బరిలోకి భారత జట్టు..?
India Vs Afghanistan
Venkata Chari
|

Updated on: Sep 16, 2026 | 8:11 PM

Share

India vs Afghanistan: ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు (Afghanistan Cricket Team) తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు (Team India) ఇప్పటికే 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాలు సాధించిన భారత్, సెప్టెంబర్ 17 గురువారం నాడు నామమాత్రమైన మూడో టీ20 సమరంలో తలపడనుంది. మొదటి రెండు మ్యాచ్ ల్లో కలిపి మొత్తం 12 మంది ఆటగాళ్లను పరీక్షించిన టీమ్ మేనేజ్‌మెంట్, సిరీస్ చేతికి రావడంతో ఆఖరి మ్యాచ్‌లో మరికొందరికి మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే జట్టులో నిలకడగా రాణిస్తున్న ముగ్గురు కీలక సభ్యులకు విశ్రాంతినిచ్చి రిజర్వ్ బెంచ్ పై ఉన్న వారికి తుది జట్టు (Playing XI) తలుపులు తెరిచేందుకు రంగం సిద్ధమవుతోంది.

ప్రస్తుత సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కు మూడో మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చే యోచనలో జట్టు ఉంది. మొదటి మ్యాచ్‌లో 82 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన అభిషేక్, రెండో పోరులో 39 పరుగులు జోడించాడు. ఆయన స్థానంలో యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ని బరిలోకి దించే అవకాశాలున్నాయి. జింబాబ్వే టూర్‌లో రాణించినప్పటికీ సంజు శాంసన్ (Sanju Samson) రాకతో వైభవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. శాంసన్ రెండో మ్యాచ్‌లో అర్థశతకంతో రాణించడంతో, అభిషేక్ స్థానంలోనే వైభవ్‌ను ఓపెనర్‌గా ఆడించే వెసులుబాటు దక్కనుంది.

ఎక్కువమంది చదివినది: తొలి పరుగు కోసం 53 బంతులు.. టెస్టుల్లో ఊహించని రికార్డు నెలకొల్పిన టీమిండియా స్టార్..!

ఎడమచేతి వాటం స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) సైతం రెస్ట్ తీసుకునే ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. బ్యాటింగ్ అవకాశం రాకపోయినా బౌలింగ్‌లో మొదటి మ్యాచ్‌లో 27 రన్స్ ఇచ్చి 1 వికెట్, రెండో మ్యాచ్‌లో 28 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఆయనకు విశ్రాంతినిస్తే ఎడమచేతి బ్యాటింగ్, కుడిచేతి ఆఫ్ స్పిన్ వేసే వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినది: ఒకే ఓవర్లో 27 పరుగులు.. ఉతికారేసిన ఓపెనర్స్.. 20 బంతుల్లో ఇచ్చిపడేసిన శాంసన్..!

పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద ఈ మ్యాచ్‌లో రెస్ట్ దక్కే అవకాశం ఉంది. గతంలో ఇంగ్లండ్ పర్యటనలోని రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. ఆ దెబ్బ కారణంగా ఆగస్టులో శ్రీలంక టూర్‌కు దూరమైన బుమ్రా, వేగంగా కోలుకుని ఈ సిరీస్ మొదటి రెండు మ్యాచ్‌లలోనూ పాల్గొన్నాడు. రాబోయే ఆసియన్ గేమ్స్ (Asian Games) ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆయనకు విశ్రాంతినిచ్చి, పేసర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) కు తుది జట్టులో చోటు కల్పించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us