AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Nz: భారత్, న్యూజిలాండ్ కాన్వాయ్‎లోకి ప్రైవేట్ వాహనం.. చివరికి ఏమైందంటే..

నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్ల ఆటగాళ్లు కాన్పూర్ చేరుకున్నారు...

Ind Vs Nz: భారత్, న్యూజిలాండ్ కాన్వాయ్‎లోకి ప్రైవేట్ వాహనం.. చివరికి ఏమైందంటే..
Ind Vs Nz
Srinivas Chekkilla
|

Updated on: Nov 23, 2021 | 9:37 AM

Share

నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్ల ఆటగాళ్లు కాన్పూర్ చేరుకున్నారు. భారత టెస్టు జట్టులో ఎంపికైన కొందరు ఆటగాళ్లు ఇప్పటికే కాన్పూర్‌లో ఉండగా, టీ20 జట్టులో భాగమైన కొందరు కోల్‌కతాలో చివరి టీ20 ముగిసిన తర్వాత సోమవారం న్యూజిలాండ్ జట్టుతో పాటు కాన్పూర్ చేరుకున్నారు. అయితే కాన్పూర్‌కు చేరుకోగానే భారత్, న్యూజిలాండ్ జట్ల కాన్వాయ్‌లో చోటుచేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కి వెళ్తుండగా.. భారత్-న్యూజిలాండ్ జట్టు కాన్వాయ్‌లోకి బయటి వాహనం ప్రవేశించింది.

ఇండియా, న్యూజిలాండ్ జట్టు విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్తుండగా జట్ల కాన్వాయ్‌లో నలుపు రంగు XUV కారు వచ్చింది. కాన్వాయ్‌లోకి బ్లాక్ కలర్ ఎక్స్‌యూవీ అకస్మాత్తుగా ప్రవేశించడం సంచలనం సృష్టించింది. భద్రత సిబ్బంది ఆ కారును అడ్డగించగా ఆ కారు కూడా టీమ్ హోటల్‌కే వెళుతోందని, అందులో కొందరు బీసీసీఐ అధికారులు ఉన్నారని తెలిసింది.

న్యూజిలాండ్ జట్టు సోమవారం మధ్యాహ్నం కాన్పూర్ చేరుకుంది ఐదుగురు ఇండియాను ఆటగాళ్లతో సహా మొత్తం న్యూజిలాండ్ జట్టు సోమవారం మధ్యాహ్నం 2:25 గంటలకు స్పైస్‌జెట్ విమానంలో కాన్పూర్ చేరుకున్నారు. చకేరీ విమానాశ్రయం నుండి దిగిన తర్వాత, రెండు జట్ల ఆటగాళ్లు సహాయక సిబ్బంది, వారి కోచ్‌లతో కలిసి బయో బబుల్ సర్కిల్‌లోని టీమ్ హోటల్‌కు బయలుదేరారు. ఇరు జట్ల ఆటగాళ్లకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సోమవారం కాన్పూర్ చేరుకున్న వారిలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, ఆర్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

టెస్టు సిరీస్‌కు ముందు కివీస్ క్రికెటర్లు ఉత్సాహంగా కనిపించారు ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత న్యూజిలాండ్ జట్టు సభ్యులు స్థానికులతో కలిసి సెల్ఫీలు దిగుతూ కనిపించారు. జట్టులో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారెల్ మిచెల్, టామ్ బ్లండెల్, హెన్రీ నికోల్స్, రాస్ టేలర్, విల్లిమ్ యంగ్, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, కైల్ జామీసన్, నీల్ వాగ్నర్, మిచెల్ సాంట్నర్, ఐజాజ్ పటేల్, విల్ సమ్మర్‌విల్లే, గ్లెన్‌ ఉన్నారు.

Read Also.. Ban Vs Pak: చివరి బంతికి రెండు పరుగులు చేయాలి.. ఉత్కంఠ పోరులో గెలుపు ఎవరిదంటే..