
Abhishek Sharma hits fifty in 14 balls: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒక భారతీయ బ్యాటర్ సాధించిన రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా ఇది రికార్డుల్లోకెక్కింది.
యువరాజ్ సింగ్ రికార్డు.. ఈ జాబితాలో టీమ్ ఇండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్పై యువీ కేవలం 12 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్లోనే స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో యువీ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకోవడంతో, యువరాజ్ తర్వాత అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.