AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. పుజారే, రహానేలకు మళ్లీ నిరాశ.. కొత్త ముఖాలివే

భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య జనవరి 25 నుంచి టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం 5 టెస్ట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం (జనవరి 13) ప్రకటించింది . ఈ సిరీస్‌కు ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా, ఇప్పుడు భారత జట్టును కూడా ప్రకటించింది.

IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. పుజారే, రహానేలకు మళ్లీ నిరాశ.. కొత్త ముఖాలివే
Team India
Basha Shek
|

Updated on: Jan 13, 2024 | 7:35 AM

Share

భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య జనవరి 25 నుంచి టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం 5 టెస్ట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ శుక్రవారం (జనవరి 13) ప్రకటించింది . ఈ సిరీస్‌కు ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా, ఇప్పుడు భారత జట్టును కూడా ప్రకటించింది. ఈ సిరిస్‌లోని తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. గాయం కారణంగా షమీ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో షమీ తన గాయం నుంచి కోలుకుని టీమ్ ఇండియాకు తిరిగి వస్తాడని భావించారు. అయితే తొలి రెండు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో షమీ పేరు లేదు. షమీతో పాటు యువ వికెట్ కీపర్-బ్యాటర్‌ ఇషాన్ కిషన్ కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఎంపిక చేసిన టెస్టు జట్టులో కిషన్‌కు కూడా చోటు దక్కలేదు.

ఈ ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం

జనవరి నెలాఖరులో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం ఇద్దరు కొత్త ఆటగాళ్లను టెస్టు జట్టులోకి తీసుకున్నారు. ఆ ఆటగాళ్లలో మొదటి పేరు అవేష్ ఖాన్. మహ్మద్ షమీ కొరతను అధిగమించేందుకు టీమిండియా టెస్టు జట్టులో అవేశ్‌కు అవకాశం లభించింది. మరోవైపు జట్టులో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ స్థానంలో ధృవ్ జురెల్‌కు అవకాశం లభించింది. ధృవ్ జురెల్ రాకతో భారత జట్టులో మొత్తం 3 వికెట్ కీపర్లు ఉన్నారు. ఈ స్థానానికి ధ్రువ్‌తో పాటు కేఎల్ రాహుల్, కేఎల్ భరత్ కూడా ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి

జట్టులో నలుగురు స్పిన్నర్లు

భారత్‌లో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టులో నలుగురు స్పిన్ బౌలర్లు ఎంపికయ్యారు. ఆ నలుగురిలో రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. మిగిలిన ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేశ్ ఖాన్ ఉన్నారు.

తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..