ICC Womens T20 World Cup 2024 Bangladesh Host: మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఈ రోజు తిరుగుబాటు జరిగింది. దీంతో ఆ దేశంలో అలజడి రేగింది. ఎక్కడ చూసినా హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. అంతేకాదు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా దేశం విడిచి పారిపోయారు. అదే సమయంలో, ఈసారి మహిళల T20 ప్రపంచ కప్ 2024 ఆతిథ్యం బంగ్లాదేశ్ చేతిలో ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ ఈవెంట్ ముప్పులో ఉంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఇటువంటి పరిస్థితిలో, బంగ్లాదేశ్ ఈ పెద్ద ICC టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వగలదా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024కి 2 నెలల కంటే తక్కువ సమయం ఉంది. అయితే, బంగ్లాదేశ్లో దిగజారుతున్న పరిస్థితుల దృష్ట్యా, దీనిపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా దీనిపై నిఘా పెట్టింది. అయితే, దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు.
ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్నకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. ప్రపంచకప్లో ఏ దేశానికైనా అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం, ఏ జట్టుకు ముప్పు వాటిల్లకుండా చూడడం. కానీ, ఇప్పుడు హఠాత్తుగా బంగ్లాదేశ్లో పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయం బంగ్లాదేశ్ క్రికెట్కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.
#BREAKING: Bangladesh Prime Minister Sheikh Hasina has landed in Agartala, the capital city of Indian state of Tripura as per reports. Agartala is the closest Indian city to Dhaka. Below visuals of Sheikh Hasina along with her sister escaping in a Bangladesh Air Force chopper. pic.twitter.com/JqeDS8BnAy
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 5, 2024
బంగ్లాదేశ్లో పరిస్థితి వీలైనంత త్వరగా మెరుగుపడకపోతే, ఐసీసీ ఈ టోర్నమెంట్ను వేరే దేశానికి మార్చవచ్చు. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 అక్టోబర్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ గడ్డపై ప్రపంచకప్ నిర్వహించడం సాధ్యం కాదని చాలా మీడియా కథనాలు చెబుతున్నాయి.
బంగ్లాదేశ్లో దిగజారుతున్న పరిస్థితుల దృష్ట్యా, ICC ఇప్పుడు మహిళల T20 ప్రపంచ కప్ 2024ని USA లేదా UAEకి మార్చవచ్చు. అయితే, ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. టోర్నమెంట్ని మార్చడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..