ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల.. నాలుగో స్థానంలో భారత ఓపెనర్..

ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ 20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం ఎగబాకి 4స్థానంలో నిలిచాడు...

ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ విడుదల.. నాలుగో స్థానంలో భారత ఓపెనర్..
kl rahul
Follow us

|

Updated on: Feb 02, 2022 | 4:41 PM

ఐసీసీ బుధవారం విడుదల చేసిన టీ 20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్(kl Rahul) ఒక స్థానం ఎగబాకి 4స్థానంలో నిలిచాడు. అదే సమయంలో మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(virat kohli) 10వ స్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా కొత్త వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ(rohith sharma) 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్ 20వ స్థానంలో ఉన్నాడు. ఇది భారత బౌలర్లలో ప్రస్తుత ర్యాంకింగ్‌లో అత్యధిక స్థానం.

ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టాప్-10లో భారతీయులెవరూ లేరు. భారత్ ఇటీవల టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. వెస్టిండీస్ ఇటీవల ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. దీంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ అకిల్ హొస్సేన్, పేసర్ జెస్ హోల్డర్ తమ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్స్ సాధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను గెలిపించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు.

హుస్సేన్ 15 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ హోల్డర్.. చివరి మ్యాచ్ చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతని వికెట్ల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. మూడు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు.

షెల్డన్ కాట్రెల్ 10 స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ మూడు స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరుకున్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 33 స్థానాలు ఎగబాకి 68వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కూడా విండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. బ్రెండన్ కింగ్ 25 స్థానాలు ఎగబాకి 58వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ 15 స్థానాలు ఎగబాకి 60వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

నాలుగో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన మొయిన్ అలీ 30 స్థానాలు ఎగబాకాడు. మూడు మ్యాచ్‌ల్లో 73 పరుగులు చేసి 67వ స్థానానికి చేరుకున్నాడు. రెండు వికెట్లు కూడా తీశాడు. ఈ కారణంగానే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకున్నాడు.

Read Also.. MS Dhoni: ప్రశాంతంగా టెన్నిస్ ఆడుతున్న ఎంఎస్ ధోనీ.. వైరల్ అయిన ఫొటోలు..

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు