AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: కెప్టెన్లపై ఆందోళనలో మూడు జట్లు.. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్యాన్స్‌కు బిగ్ షాక్?

IPL 2024 Captains: ప్రారంభానికి ముందు, మూడు జట్లు కెప్టెన్ గురించి ఆందోళన చెందుతున్నాయి. ఇద్దరు ఆటగాళ్లు కెప్టెన్‌గా తిరిగి రానున్నారు. అయితే వారి ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయా జట్ల కెప్టెన్‌గా ఎవరు ఉంటారు? దీనిపై కూడా సందేహం ఉంది. ఈ మూడు జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో ఫ్యాన్స్ ప్రస్తుతం అయోమయంలో పడ్డారు.

IPL 2024: కెప్టెన్లపై ఆందోళనలో మూడు జట్లు.. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫ్యాన్స్‌కు బిగ్ షాక్?
Ipl 2024
Venkata Chari
|

Updated on: Mar 15, 2024 | 4:00 PM

Share

Rishabh Pant – Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కేవలం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 2024 కోసం అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. కొత్త కెప్టెన్లతో ఈ సీజన్‌లో చాలా జట్లు ప్రవేశించనున్నాయి. అయితే, కెప్టెన్‌పై మూడు జట్లు ఆందోళన చెందుతున్నాయి. వారి కెప్టెన్‌గా ఎవరు ఉంటారు? దీనిపై కూడా సందేహం ఉంది. ఈ మూడు జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో ఫ్యాన్స్ ప్రస్తుతం అయోమయంలో పడ్డారు.

ఐపీఎల్ 2024లో ఇద్దరు ఆటగాళ్లు తిరిగి కెప్టెన్‌గా మారబోతున్నారు. ఒకరు శ్రేయాస్ అయ్యర్ కాగా మరొకరు రిషబ్ పంత్. వీరిద్దరూ గాయం కారణంగా గతేడాది ఐపీఎల్‌లో ఆడలేదు. ఇప్పుడు ఈ లీగ్ సీజన్‌లో కెప్టెన్‌లుగా ప్రవేశించవచ్చు. అయితే, వారి పాత్ర ఎలా ఉంటుంది? దీనిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం ఇద్దరి ఫిట్‌నెస్. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆడడం ఖాయం. కానీ, అంతకు ముందు ముంబై తరపున రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు వచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 95 పరుగులు చేశాడు. కానీ, ఈ సమయంలో, అతని పాత వెన్ను గాయం మళ్లీ బయటపడింది. ఈ కారణంగా, అతను రంజీ ట్రోఫీ ఫైనల్‌లో నాలుగు, ఐదవ రోజులలో ఫీల్డింగ్ చేయలేదు. బ్యాక్ స్కాన్ కోసం ఆసుపత్రికి కూడా వెళ్ళాడు. అంటే అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తాయి.

గత ఏడాది కూడా శ్రేయాస్ అయ్యర్ అన్ ఫిట్ కావడంతో నితీష్ రానా కేకేఆర్ బాధ్యతలు చేపట్టాడు. ఈ ఏడాది కూడా లీగ్ ప్రారంభం కాకముందే గాయపడ్డాడనే వార్తలు జట్టు కష్టాలను మరింత పెంచేశాయి. తొలి మ్యాచ్‌ల్లో శ్రేయస్ కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో, KKR ప్రారంభ మ్యాచ్‌లకు కొత్త కెప్టెన్‌ను కూడా కనుగొనవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రిషబ్ పంత్ ఫిట్‌గా మారడం..

రిషబ్ పంత్ ఫిట్‌గా మారడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త. అలాంటి పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ అప్పగించవచ్చు. అయితే, ఐపీఎల్ ఒత్తిడిని తట్టుకునేంత ఫిట్‌గా పంత్ ఉన్నాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. పంత్‌పై అదనపు ఒత్తిడి లేకుండా, ఫ్రాంచైజీ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చని కూడా నివేదికలు ఉన్నాయి. ఇది జరిగితే, పంత్ వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టం. కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో గతేడాది మాదిరిగానే డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించవచ్చు.

కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై కూడా ప్రశ్నలు..

లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై కూడా ప్రశ్నలు ఉన్నాయి. గాయం కారణంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. దీని తరువాత అతను పునరావాసం కోసం NCA కి వెళ్ళాడు. అక్కడి నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. కానీ, అతని సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకోసం లండన్ కూడా వెళ్లి ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌ మొత్తం ఆడలేకపోయాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచ్‌లలో ఆడకపోతే, అతని స్థానంలో ఎవరు జట్టు బాధ్యతలు తీసుకుంటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..