Flashback 2002 : భారత్‌లో జింబాబ్వే ఆఖరి మ్యాచ్ ఆడినప్పుడు ఇషాన్ కిషన్‌, అభిషేక్ శర్మ వయసెంతో తెలిస్తే షాకవుతారు

Flashback 2002 : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఇప్పుడు ఒక కీలక మలుపుకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన భారత్‌కు, సూపర్-8లో సౌతాఫ్రికా గట్టి షాక్ ఇచ్చింది. సెమీఫైనల్ చేరాలంటే ఇప్పుడు భారత్ తన తదుపరి మ్యాచ్‌ల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధించాల్సి ఉంది.

Flashback 2002 : భారత్‌లో జింబాబ్వే ఆఖరి మ్యాచ్ ఆడినప్పుడు ఇషాన్ కిషన్‌, అభిషేక్ శర్మ వయసెంతో తెలిస్తే షాకవుతారు
Ishan Kishan Abhishek Sharma

Updated on: Feb 23, 2026 | 3:59 PM

Flashback 2002 : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఇప్పుడు ఒక కీలక మలుపుకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్‌లో తిరుగులేని విజయాలతో దూసుకుపోయిన భారత్‌కు, సూపర్-8లో సౌతాఫ్రికా గట్టి షాక్ ఇచ్చింది. సెమీఫైనల్ చేరాలంటే ఇప్పుడు భారత్ తన తదుపరి మ్యాచ్‌ల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు సాధించాల్సి ఉంది. అయితే, తర్వాతి ప్రత్యర్థి జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించి టోర్నీ నుంచే పంపేసిన ఘనత వారిది. ఈ నేపథ్యంలో భారత్ – జింబాబ్వే జట్ల మధ్య భారత గడ్డపై జరిగిన చివరి పోరు గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

భారత గడ్డపై జింబాబ్వే జట్టు టీమిండియాతో తలపడి దశాబ్దాలు గడిచిపోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2002 సంవత్సరం తర్వాత జింబాబ్వే భారత్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే దాదాపు 24 ఏళ్లుగా ఆ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టలేదు. చివరిసారిగా 2002, మార్చి 19న గౌహతి వేదికగా ఇరు జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 333 పరుగుల భారీ స్కోరు సాధించగా, జింబాబ్వే కేవలం 232 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టీ20ల విషయానికి వస్తే భారత గడ్డపై ఇరు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తలపడలేదు. 2022 మెల్బోర్న్ వరల్డ్ కప్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.

భారత గడ్డపై ఆఖరి మ్యాచ్ జరిగినప్పుడు (2002లో), ప్రస్తుత టీమిండియా ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అసలు క్రికెట్ బ్యాట్ పట్టుకునే వయసులో కూడా లేరు. 1998, జూలై 18న జన్మించిన ఇషాన్ కిషన్ అప్పట్లో కేవలం 4 ఏళ్ల చిన్నారి. ఇక 2000, సెప్టెంబర్ 4న జన్మించిన అభిషేక్ శర్మ వయసు ఆ సమయంలో కేవలం 2 ఏళ్లు మాత్రమే. అంటే వీరు కనీసం స్కూల్‌కు వెళ్లడం కూడా మొదలుపెట్టని వయసులో జింబాబ్వే భారత్‌లో చివరి మ్యాచ్ ఆడింది. ఇప్పుడు అదే ఇషాన్, అభిషేక్ జోడీ జింబాబ్వే బౌలర్లను ఎదుర్కోవడానికి సిద్ధమవుతుండటం విశేషం.

జింబాబ్వే జట్టు ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారింది. సికిందర్ రజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ రక్తం ఆ జట్టుకు బలాన్నిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన తర్వాత వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. భారత జట్టు తన సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి 24 ఏళ్ల తర్వాత భారత గడ్డపై కాకపోయినా, ఈ మెగా టోర్నీలో జింబాబ్వేను భారత్ ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us