AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: స్పైసీ ట్రాక్‌తో భయపెడుతోన్న లార్డ్స్ పిచ్.. బ్యాటర్లంతా 108కి కాల్ చేయాల్సిందేగా..?

First Look Of Lord's Pitch For India vs England 3rd Test Out: లార్డ్స్‌లో భారత్ రికార్డు అంత బాగాలేదు, 19 టెస్టుల్లో కేవలం 3 మాత్రమే గెలిచింది. కానీ ఇటీవల వారి ప్రదర్శన మెరుగైంది. ఈసారి పచ్చని పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌లు ఎలా రాణిస్తారు, బుమ్రా సారథ్యంలోని భారత పేస్ దళం ఎలా చెలరేగుతుంది అనేది చూడాలి.

IND vs ENG: స్పైసీ ట్రాక్‌తో భయపెడుతోన్న లార్డ్స్ పిచ్.. బ్యాటర్లంతా 108కి కాల్ చేయాల్సిందేగా..?
Lord's Pitch Photos
Venkata Chari
|

Updated on: Jul 09, 2025 | 7:30 AM

Share

First Look Of Lord’s Pitch For India vs England 3rd Test Out: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఉత్కంఠ పతాక స్థాయికి చేరుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ భారీ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయడంతో, ఇప్పుడు జులై 10 నుంచి లార్డ్స్‌లో ప్రారంభమయ్యే మూడో టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు లార్డ్స్ పిచ్‌పై తొలి చూపు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది – ఇది బ్యాట్స్‌మెన్‌లకు నరకం చూపించడం ఖాయమని తెలుస్తోంది..!

పచ్చని పిచ్, పేసర్లకు పండుగే..!

లార్డ్స్ పిచ్‌పై ప్రస్తుతం పచ్చని గడ్డి దట్టంగా కనబడుతోంది. పిచ్ కండిషన్స్ చూస్తుంటే, మొదటి రెండు టెస్టుల కంటే ఇది చాలా భిన్నంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. లీడ్స్, ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలించగా, లార్డ్స్ పిచ్‌ మాత్రం పేస్ బౌలర్లకు స్వర్గధామంగా మారే అవకాశం ఉంది.

భారత బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్ మాట్లాడుతూ, “పిచ్ చాలా పచ్చగా ఉంది. రేపు గడ్డి కత్తిరించిన తర్వాత ఒక అంచనా వస్తుంది. బౌలర్లకు సహాయం లభిస్తుందని ఆశించవచ్చు. బ్యాటర్లకు మానసికంగా సిద్ధంగా ఉండటం కీలకం” అని తెలిపారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది పేసర్లకు అనుకూలించే వ్యూహాన్ని భారత్ అనుసరించే అవకాశం ఉందని సూచిస్తుంది.

ఇంగ్లాండ్ వ్యూహం: స్పైసీ పిచ్..!

ఎడ్జ్‌బాస్టన్‌లో ఘోర పరాజయం తర్వాత, ఇంగ్లాండ్ తమ వ్యూహాన్ని మార్చుకుంది. కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ ఇద్దరూ లార్డ్స్‌లో “మరింత పేస్, బౌన్స్” పిచ్ కావాలని కోరినట్లు సమాచారం. జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ వంటి పేసర్‌లను జట్టులోకి తీసుకోవడంతో, ఇంగ్లాండ్ భారత్‌ను తమ పేస్ దాడితో దెబ్బతీయాలని చూస్తోంది. గత నెలలో లార్డ్స్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో పేసర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో, అదే తరహా పిచ్‌ను ఇంగ్లాండ్ ఆశిస్తోంది.

భారత్‌కు సవాలు, బుమ్రా రాక..!

లార్డ్స్‌లోని ఎనిమిది అడుగుల వాలు, పచ్చని గడ్డి భారత బ్యాట్స్‌మెన్‌లకు నిజమైన సవాలును విసిరే అవకాశం ఉంది. అయితే, రెండో టెస్టులో విశ్రాంతి తీసుకున్న జస్‌ప్రీత్ బుమ్రా మూడో టెస్టుకు తిరిగి రావడం భారత్‌కు పెద్ద బలం. బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ వంటి నాణ్యమైన పేసర్లు భారత్‌కు ఉండటంతో, పిచ్‌ పేసర్‌లకు అనుకూలించినా టీమిండియా బౌలింగ్ దళం కూడా ధీటుగా బదులిచ్చే అవకాశం ఉంది.

లార్డ్స్‌లో భారత్ రికార్డు అంత బాగాలేదు, 19 టెస్టుల్లో కేవలం 3 మాత్రమే గెలిచింది. కానీ ఇటీవల వారి ప్రదర్శన మెరుగైంది. ఈసారి పచ్చని పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌లు ఎలా రాణిస్తారు, బుమ్రా సారథ్యంలోని భారత పేస్ దళం ఎలా చెలరేగుతుంది అనేది చూడాలి. ఈ టెస్టు సిరీస్‌ గమనాన్ని నిర్ణయించే అవకాశం ఉంది!

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..