
Sarthak Ranjan: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026 చివరి దశకు చేరుకుంది. టోర్నీలో పలువురు యువ క్రికెటర్లు తమ ప్రతిభతో ఆకట్టుకుంటుండగా.. రాజకీయ నాయకుడు పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ తన బ్యాటింగ్తో ప్రత్యేకంగా నిలిచాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన అతడు.. సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించాడు. ఫైనల్కు ముందు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు.
DPL 2026లో సార్థక్ రంజన్ అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తరఫున మొత్తం 9 మ్యాచ్లు ఆడిన అతడు 493 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 54.78గా ఉండగా.. స్ట్రైక్రేట్ ఏకంగా 167.69గా నమోదైంది.
ఈ టోర్నీలో అతడి బ్యాట్ నుంచి 33 సిక్సర్లు, 44 ఫోర్లు వచ్చాయి. ఒక్క శతకం కూడా నమోదు చేయలేకపోయినప్పటికీ.. ఐదు అర్ధశతకాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడి అత్యధిక స్కోరు 95 పరుగులు.
నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నాకౌట్ దశకు చేరకముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే జట్టు ఫలితాలతో సంబంధం లేకుండా సార్థక్ రంజన్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం అభిమానులను ఆకట్టుకుంది.
ఎక్కువమంది చదివినది: రాసిపెట్టుకోండి.. అలాంటోడు దొరకడం టీమిండియా అదృష్టం.. వదిలేశారో..!
టోర్నీ చివరి దశకు వచ్చేసరికి అతడే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఫైనల్కు ముందు 493 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు.
సార్థక్ రంజన్ పరుగులతోనే కాదు.. భారీ షాట్లతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. డీపీఎల్ 2026లో అతడు 33 సిక్సర్లు బాదాడు. దీంతో టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
అతడి ఇన్నింగ్స్ల్లో బౌండరీలే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 44 ఫోర్లు, 33 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.
సార్థక్ రంజన్కు దేశవాళీ క్రికెట్లోనూ అనుభవం ఉంది. 2016లో రైల్వేస్తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అతడు దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2017లో హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో లిస్ట్-ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు.
2018లో హైదరాబాద్తో జరిగిన ఫస్ట్క్లాస్ మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు. అయితే ఢిల్లీ తరఫున ఇప్పటివరకు అతడి దేశవాళీ మ్యాచ్ల సంఖ్య పరిమితంగానే ఉంది. మొత్తం 14 మ్యాచ్ల్లో 237 పరుగులు చేశాడు.
ఫైనల్కు ముందు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సార్థక్ రంజన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
సార్థక్ రంజన్ – 493 పరుగులు
యశ్ ధుల్ – 410 పరుగులు
ఆర్యన్ గౌర్ – 382 పరుగులు
యజస్ శర్మ – 365 పరుగులు
యశ్ భాటియా – 357 పరుగులు
డీపీఎల్ 2026లో సార్థక్ రంజన్ ప్రదర్శన ఇప్పుడు అతడి దేశవాళీ కెరీర్పై ఆసక్తిని పెంచుతోంది. భారీ షాట్లు ఆడే సామర్థ్యం, మంచి స్ట్రైక్రేట్తో పరుగులు సాధించడం అతడి ప్రత్యేకతగా కనిపిస్తోంది. మరింత స్థిరంగా రాణిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయి క్రికెట్లోనూ అవకాశాలు దక్కే అవకాశం ఉంది. ఫైనల్కు ముందు ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న పప్పు యాదవ్ కుమారుడు.. ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..