
అహ్మదాబాద్లో బుధవారం జరుగుతున్న మూడో వన్డేలో భారత్, ఇంగ్లాండ్ జట్లు గ్రీన్ ఆర్మ్ బ్యాండ్లు ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రత్యేక చర్యకు ఓ గొప్ప కారణం ఉంది. బీసీసీఐ చేపట్టిన “అవయవాలను దానం చేయండి, ప్రాణాలను కాపాడండి” అనే సామాజిక అవగాహన కార్యక్రమానికి మద్దతుగా, ఇరు జట్ల ఆటగాళ్లు ఆకుపచ్చ బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు. ఈ కార్యక్రమాన్ని ఐసీసీ చైర్మన్ జే షా సమర్థంగా ముందుకు తీసుకెళ్లుతున్నారు.
ఈ చొరవను ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జే షా స్వయంగా ప్రకటించారు. “క్రీడకు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంది. అవయవదానం ద్వారా మనం మరికొందరికి జీవితం అందించగలం. అందుకే, ప్రతి ఒక్కరూ ఓ చిన్న అడుగు వేయాలి” అని షా అన్నారు. ఈ కార్యక్రమానికి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ వంటి ప్రముఖ భారత క్రికెటర్లు తమ మద్దతు ప్రకటించారు.
విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, “అంతిమ సెంచరీ సాధించండి. మీ అవయవాల దానంతో మరికొందరికి జీవితం కల్పించండి” అని పేర్కొన్నారు. శుభ్మాన్ గిల్ తన సందేశంలో “జీవితానికి కెప్టెన్గా ఉండండి. ఒకరు విజయం సాధించడానికి మార్గనిర్దేశం చేసేలా ఉండండి” అని అన్నారు. శ్రేయాస్ అయ్యర్ “ఒక దాత ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలడు” అని తెలిపారు, ఇక కెఎల్ రాహుల్ “అల్టిమేట్ విన్నింగ్ షాట్ ఆడండి. మీ అవయవదానం ఒకరి జీవితంలో మ్యాచ్ విన్నింగ్ క్షణం కావచ్చు” అంటూ ప్రేరణ కలిగించారు.
ఈ చొరవ కేవలం క్రికెట్ ప్రపంచానికే పరిమితం కాకుండా, సమాజంలో అవయవదానం గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లతో కలిసి, ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములై, జీవితం ప్రసాదించే దాతలుగా మారాలని బీసీసీఐ కోరుతోంది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడవ వన్డేలో, ఇంగ్లాండ్ టాస్ గెలిచి భారతదేశాన్ని బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత ఇన్నింగ్స్లో, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలు సాధించారు, గిల్ 96 పరుగులు చేయగా, కోహ్లీ 52 పరుగులు చేశారు. రోహిత్ శర్మ ప్రారంభంలోనే అవుట్ అయ్యారు. ప్రస్తుతం, గిల్-శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు, భారత్ 30 ఓవర్లలో 198/2 స్కోర్ చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో, మార్క్ వుడ్ రోహిత్ శర్మను తొందరగా అవుట్ చేయగా, ఆదిల్ రషీద్ విరాట్ కోహ్లీ వికెట్ తీశారు. ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే సిరీస్ను కోల్పోయినప్పటికీ, ఈ మ్యాచ్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఉత్సాహాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
The two teams are wearing green arm bands to support BCCI’s initiative "Donate Organs, Save Lives” in #INDvsENG Final ODI at Ahmedabad.
The initiative is spearheaded by ICC Chairman Mr Jay Shah.
Pledge, spread the word, and let's be a part of something truly meaningful.… pic.twitter.com/9MllaJUuNM
— Indian Cricket Team (@incricketteam) February 12, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..