
Delhi Capitals: ఐపీఎల్ 2025 (IPL 2025) లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన చాలా బాగుంది. కానీ, ఈ సీజన్లో ప్లేఆఫ్స్లో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్లో చోటు దక్కించుకోలేకపోయింది. ఆ జట్టు సీజన్ను బాగా ప్రారంభించింది. కానీ, మధ్యలో వరుస పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కారణంగా ప్లేఆఫ్లకు చేరుకోలేకపోయింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తమదైన ముద్ర వేసిన కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. కానీ, కొంతమంది అద్భుతమైన ప్రదర్శన చూపించలేకపోయారు. జట్టులో రూ. 11 కోట్లకు కొనుగోలు చేసిన ఓ ఆటగాడు కూడా ఉన్నాడు. కానీ అతను కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ, ఇలా ఎందుకు జరిగిందో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించాడు.
ఈ ఆటగాడి పేరు టి నటరాజన్. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ ఐపీఎల్ 2025లో కేవలం రెండు మ్యాచ్ల్లోనే పాల్గొనగలిగాడు. ఐపీఎల్ 2025లో నటరాజన్కు ఎందుకు ఎక్కువ అవకాశాలు రాలేదో హేమాంగ్ బదానీ క్లారిటీ ఇచ్చాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ, హేమాంగ్ బదానీ, ‘మనం ఒక ఆటగాడిపై రూ. 11 కోట్లు ఖర్చు చేసి అతన్ని బెంచ్ మీద ఎందుకు ఉంచుతాం? మిడిల్, లాస్ట్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి నటరాజన్ను జట్టులో చేర్చుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
నటరాజన్ ఫిట్నెస్ గురించి కోచ్ బదానీ ప్రస్తావిస్తూ, ‘గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా అతను పూర్తిగా ఫిట్గా లేడు. సీజన్ అంతా గాయపడ్డాడు. అందుకే మేం అతనికి అవకాశం ఇవ్వలేదు. అందుకే నటరాజన్ ఐపీఎల్ 2025లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతను పూర్తిగా ఫిట్గా ఉంటే, మేం అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చేవాళ్ళం’ అని అన్నారు.
IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే, ఆ జట్టు 14 మ్యాచ్ల్లో 7 గెలిచి 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఢిల్లీ జట్టు 15 పాయింట్లతో IPL 2025 పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు, బలమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఢిల్లీ ప్లేఆఫ్స్కు చేరుకుంటుందని అనిపించింది. కానీ, అది జరగలేదు. వచ్చే సీజన్లో, ఢిల్లీ క్యాపిటల్స్ మరింత మెరుగ్గా రాణించాలని చూస్తుంది. టోర్నమెంట్లో ట్రోఫీని కూడా గెలుచుకోవాలని కోరుకుంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..