AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Policy: ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. అఫ్గాన్ సిరీస్‌తోనే అమలు..!

BCCI Selection Policy: గాయపడిన ఆటగాళ్ల ఎంపిక విషయంలో బీసీసీఐ కొత్త విధానాన్ని అనుసరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణాలను ఫిట్‌నెస్ షరతుతో ఎంపిక చేయడం ఈ విధానానికి ఉదాహరణగా నిలిచింది.

BCCI Policy: ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. అఫ్గాన్ సిరీస్‌తోనే అమలు..!
Bcci Selection Policy
Venkata Chari
|

Updated on: Sep 02, 2026 | 10:45 AM

Share

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్‌నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే వారి తుది లభ్యతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల గాయపడిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుని, ఆ తర్వాత వారు మ్యాచ్‌లకు దూరమైన సందర్భాల నేపథ్యంలో ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు సమాచారం.

‘100 కాదు.. 200 శాతం’ నమ్మకం..

నివేదిక ప్రకారం.. ఇక ఆటగాడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాకుండా 200 శాతం నమ్మకం ఉన్నప్పుడే అతడిని పూర్తిగా ఎంపిక చేసినట్లు పరిగణించే విధానాన్ని బీసీసీఐ అవలంబించనుంది. దీనివల్ల జాతీయ జట్టులోకి ఎంపికైన తర్వాత ఫిట్‌నెస్ కారణంగా ఆటగాడు అందుబాటులో లేకపోయే పరిస్థితులను తగ్గించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్‌ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్‌‌లో ఒంటి చేత్తో..!

ఇవి కూడా చదవండి

అయితే అంతర్జాతీయ సిరీస్‌కు జట్లను సాధారణంగా కొన్ని వారాల ముందే ఎంపిక చేస్తారు. ఎంపిక తేదీకి ఆటగాడు పూర్తి ఫిట్‌గా లేకపోయినా, సిరీస్ ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే అతడిని పూర్తిగా పక్కన పెట్టకుండా ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ ఎంపిక చేసే విధానాన్ని బీసీసీఐ కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వివరించినట్లు నివేదిక పేర్కొంది.

అఫ్గాన్ సిరీస్‌లో నలుగురిపై దృష్టి..

సెప్టెంబర్ 13 నుంచి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ప్రకటించిన 15 మంది జట్టులో బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణాలకు ఫిట్‌నెస్ క్లియరెన్స్ తప్పనిసరి. నివేదిక ప్రకారం బుమ్రా, నితీశ్ సిరీస్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే దిశగా ఉన్నారు. అయితే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ పరిస్థితిపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది.

Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?
తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం
తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం
నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!
నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!
కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!
కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!
ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి
ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు
ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు
హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు
హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు
నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్
నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్