AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్, పాక్ మ్యాచ్‌కు ముందే సెలబ్రేషన్స్.. వేడుకకు గోల్డెన్ టిక్కెట్ అతిథులు..

India vs Pakistan, ODI World Cup 2023: అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ ఘర్షణ ప్రారంభానికి ముందు వేడుకలు నిర్వహించాలని BCCI నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ వేడుకలకు గోల్డెన్ టిక్కెట్ అతిథులు సచిన్ టెండూల్కర్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్‌లాంటి దిగ్గజాలు ఈ మ్యాచ్ చూసేందుకు రానున్నారు.

IND vs PAK: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్, పాక్ మ్యాచ్‌కు ముందే సెలబ్రేషన్స్.. వేడుకకు గోల్డెన్ టిక్కెట్ అతిథులు..
Ind Vs Pak Cwc 2023
Venkata Chari
|

Updated on: Oct 11, 2023 | 3:21 PM

Share

ఐసీసీ ప్రపంచ కప్ 2023 (ICC world cup 2023)​ ప్రారంభ వేడుకలు రద్దు కావడంతో నిరాశకు గురైన సంగతి తెలిసిందే. అయితే, అభిమానులకు ఇప్పుడు సంతోషకరమైన వార్త అందింది. అక్టోబరు 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi stadium) లో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య హైవోల్టేజీ పోరు ప్రారంభం కావడానికి ముందు సెలబ్రేషన్స్(Musical Ceremony)ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లో అభిమానుల కోసం బీసీసీఐ ఈ సెలబ్రేషన్స్‌ను నిర్వహించనుంది. ఈ సమయంలో, లైట్ షోలతోపాటు డ్యాన్స్ ప్రదర్శనలు ఉంటాయి. గాయకుడు అరిజిత్ సింగ్ (Arijit Singh) ప్రదర్శన ఇవ్వనున్నారని తెలుస్తోంది.

గోల్డెన్ టిక్కెట్ సెలబ్రిటీలు..

ప్రపంచకప్ ప్రారంభానికి ముందే సచిన్ టెండూల్కర్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్‌లకు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్లు అందించింది. అందుకే ఈ ముగ్గురిని ప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానించారు. నివేదికల ప్రకారం అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు సంగీత్ వేడుకను నిర్వహించనున్నారు. గోల్డెన్ టికెట్ హోల్డర్లు మ్యాచ్ చూసేందుకు స్టేడియం వద్దకు వస్తారని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అనిల్ పటేల్ తెలిపినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

25 పాకిస్థాన్ మీడియా..

వీరే కాకుండా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు పలువురు వీఐపీలు వచ్చే అవకాశం ఉంది. ఆ రోజున బాలీవుడ్ స్టార్స్ ఈవెంట్ మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:10 గంటలకు ముగుస్తుంది. అలాగే భారత్-పాక్ మ్యాచ్ కు 20 నుంచి 25 మంది పాక్ మీడియా ప్రతినిధులు రానున్నారు. అనుమతి ఇచ్చామని, అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మ్యాచ్‌కు పీసీబీకి చెందిన కొందరు అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూపులు..

View this post on Instagram

A post shared by ICC (@icc)

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోటీ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించడం ఇదే తొలిసారి కాదు. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో భారత్ ఆధిపత్యం చెలాయించగా, ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్ సంపూర్ణ విజయం సాధించింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!