No Handshake Policy : ఐసీసీ రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు..భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ

No Handshake Policy : అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న 5వ మ్యాచ్‌లో కేవలం ఆటపైనే కాదు.. ఇరు దేశాల కెప్టెన్ల వ్యవహారంపై కూడా అందరి దృష్టి నిలిచింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌తో క్రికెట్ మైదానంలో ఒక భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది.

No Handshake Policy : ఐసీసీ రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు..భారత్-పాక్ మ్యాచ్‌లోనూ కొనసాగిన నో-హ్యాండ్‌షేక్ పాలసీ
No Handshake Policy

Updated on: Dec 14, 2025 | 12:19 PM

No Handshake Policy : అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న 5వ మ్యాచ్‌లో కేవలం ఆటపైనే కాదు.. ఇరు దేశాల కెప్టెన్ల వ్యవహారంపై కూడా అందరి దృష్టి నిలిచింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌తో క్రికెట్ మైదానంలో ఒక భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. మ్యాచ్ ఏ స్థాయిలో జరిగినా, భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపడం లేదు, మాట్లాడటం లేదు. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుని, జూనియర్ స్థాయి క్రికెట్‌ను రాజకీయాల నుంచి దూరం ఉంచాలని భారత్‌ను కోరింది. అయితే బీసీసీఐ విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. ఫలితంగా భారత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్‌తో చేతులు కలపలేదు.

జూనియర్ క్రికెట్ నుంచి రాజకీయాలను దూరంగా ఉంచాలని, అందుకోసం హ్యాండ్‌షేక్ చేయకపోవడం అనే విధానాన్ని విరమించుకోవాలని ఐసీసీ కోరినట్లు ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు ముందు ఒక పీటీఐ నివేదిక వెల్లడించింది. భారత సైనికులు, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలపడం కోసం ఈ నో-హ్యాండ్‌షేక్ పాలసీని మొదటగా సెప్టెంబర్‌లో సీనియర్ ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా అమలు చేశారు. ఆ తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లలో కూడా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఈ విధానాన్ని పాటించారు.

అయితే, ఈ విధానాన్ని కొనసాగించాలా వద్దా అనే తుది నిర్ణయాన్ని ఐసీసీ బీసీసీఐకే వదిలేసింది. ఒకవేళ కొనసాగిస్తే, మ్యాచ్ రెఫరీకి ముందుగానే తెలియజేయాలని చెప్పింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో, భారత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే టాస్ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్‌తో చేతులు కలపలేదు. పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత, మ్హాత్రే ఆయన వెనుక చేతులు కలపకుండా నిలబడ్డాడు. యాంకర్ తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, యూసుఫ్ కనీసం కళ్ళలోకి చూడకుండానే మైక్రోఫోన్‌ను మ్హాత్రేకు ఇచ్చి నేరుగా డగౌట్‌లోకి వెళ్లిపోయాడు.

దుబాయ్‌లో వర్షం అంతరాయం కలిగించడం వల్ల మ్యాచ్‌ ప్రారంభం ఆలస్యమైంది. దీని కారణంగా ఈ మ్యాచ్‌ను 49-49 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..