ఐసీసీ తొలిసారిగా నిర్వహించనున్న మహిళల అండర్-19 ప్రపంచకప్కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఈ ప్రపంచకప్లో భారత మహిళల జట్టుకు టీమిండియా యంగ్ అండ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మ సారథ్యం వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ జనవరి 14 నుంచి 29 వరకు జరగనుంది. ఇది కాకుండా, ప్రపంచ కప్ ముందు ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు కూడా బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్సీని కూడా షెఫాలీ వర్మకు అప్పగించారు. ప్రపంచకప్కు ముందు డిసెంబర్-జనవరిలో ఈ సిరీస్ జరగనుంది. షెఫాలీ తో పాటు సీనియర్ జట్టులో ఆడిన స్టార్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా అండర్-19 మహిళల ప్రపంచకప్కు ఎంపికైంది. షెఫాలీ భారత సీనియర్ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20 మ్యాచ్లు ఆడింది. అలాగే రిచా టీమిండియా తరఫున 17 వన్డేలు, 25 టీ20 మ్యాచ్లు ఆడింది.
ఐసీసీ తొలిసారిగా అండర్-19 మహిళల ప్రపంచకప్ను నిర్వహిస్తోంది. ఇందులో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ఆతిథ్య దక్షిణాఫ్రికా, యూఏఈతో కలిసి భారత్ గ్రూప్-డిలో నిలిచింది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్-6కి వెళ్తాయి. ఈ రౌండ్లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఇక్కడ నుంచి టాప్-4 జట్లు సెమీఫైనల్లో తలపడతాయి. జనవరి 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్కు ముందు భారత జట్టు డిసెంబర్ 27 నుంచి జనవరి 4 వరకు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.
షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్) , జి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లే గాలా (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, ప్రశ్వి చోప్రా , టిటాస్ సాధు, ఫలక్ నాజ్, ఎండీ షబ్నమ్
షెఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లే గాలా, రిషితా బసు (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, ప్రశ్వి చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ MD, శిఖా నజ్లా, యశశ్రీ
? NEWS ?: India U19 Women’s squad for ICC World Cup and SA series announced.
More Details ?https://t.co/onr5tDraiq
— BCCI Women (@BCCIWomen) December 5, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..