Video: గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చిన అక్షర్.. వీడియో వైరల్

|

Jun 25, 2024 | 11:45 AM

టీమిండియా తన చివరి సూపర్-8 మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు 5వ సారి టాప్-4కి చేరుకుంది. జూన్ 27న రాత్రి 8:00 గంటలకు గయానా మైదానంలో జరిగే సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

Video: గాల్లోకి ఎగిరి, ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చిన అక్షర్.. వీడియో వైరల్
Axar Patel Catch Viral
Image Credit source: X
Follow us on

టీమిండియా తన చివరి సూపర్-8 మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు 5వ సారి టాప్-4కి చేరుకుంది. జూన్ 27న రాత్రి 8:00 గంటలకు గయానా మైదానంలో జరిగే సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో పలు ఆసక్తికర ఘట్టాలు కనిపించాయి. మిచెల్ స్టార్క్‌పై రోహిత్ 4 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత జంపా వేసిన బంతికి పాండ్యా లైఫ్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ మార్ష్ క్యాచ్‌ను మిస్ చేశాడు. రోహిత్ కొట్టిన ఒక సిక్స్ స్టేడియం పైకప్పును తాకింది. అక్షర్ అద్భుత క్యాచ్ పట్టగా, పేలవమైన కీపింగ్ కారణంగా రిషబ్ పంత్ కెప్టెన్ కోపానికి గురయ్యాడు. అలాగే, అక్షర్ పట్టిన ఓ అద్భుత క్యాచ్‌తో మ్యాచ్ టీమిండియా వైపు మళ్లింది. ఇలా ఎన్నో అద్భుత క్షణాలను ఈ మ్యాచ్ అభిమానులకు అందించింది.

అక్షర్ అద్భుత క్యాచ్..

మార్ష్, ట్రావిస్ హెడ్ జోడీ ప్రమాదకరంగా మారారు. దీంతో మ్యాచ్ మొత్తం ఆసీస్ వైపు వెళ్లింది. ఇక 9వ ఓవర్‌లో కుల్దీప్ వచ్చాడు. ఆస్ట్రేలియా బలమైన స్థితిలో ఉంది. హెడ్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా వేగంగా పరుగులు చేస్తున్నాడు. 5 బంతుల్లో కుల్దీప్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతను ఆరో బంతిని కొంచెం షార్ట్‌గా బౌల్ చేశాడు. ఇక్కడ అక్షర్ పటేల్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద నిలబడి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మిచెల్ మార్ష్ పవర్ ఫుల్ షాట్ కొట్టాడు. బంతి నేరుగా బౌండరీని దాటుతోంది. ఇక్కడ అక్షర్ గాల్లోకి లేచి తన కుడి చేతితో మిచెల్‌ ఇచ్చిన క్యాచ్‌ను అందిపుచ్చుకున్నాడు. దీంతో మిచెల్ మార్ష్ – ట్రావిస్ హెడ్ కీలక భాగస్వామ్యం కూడా పూర్తయింది. దీంతో మ్యాచ్ భారత్‌వైపు మళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అక్షర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 13 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఆ తర్వాత చివరి 7 ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకుని కంగారూ జట్టును 20 ఓవర్లలో 181/7 స్కోరుకే పరిమితం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..