
India vs Pakistan World Cup Match: వన్డే ప్రపంచ కప్ 2023 అధికారిక షెడ్యూల్ వెలువడిన తర్వాత, ప్రస్తుతం అభిమానులందరూ అక్టోబర్ 15 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ గురించి కీలక ప్రకటన చేశాడు.
అహ్మదాబాద్లో జరగనున్న ఈ మ్యాచ్ గురించి రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ఐపీఎల్ సమయంలో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఈ మైదానంలో బంతి స్వింగ్ అయ్యేది. ఇక్కడ బౌలర్లు చాలా సరదాగా బౌలింగ్ చేస్తుంటాంరు. కానీ, మేం పాకిస్థాన్తో ఆడుతున్నామంటూ చెప్పుకొచ్చాడు.
‘ఈ మ్యాచ్లో టాస్ ఎంత కీలకం కానుందో నాకు తెలియదని, రెండవ వేదిక వద్ద మేం టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వికెట్ బాగా ఉంటుంది. కానీ, అహ్మదాబాద్కు వచ్చినప్పుడు పిచ్ ఇక్కడ అంశం కీలకం కాదు’ అని అన్నాడు.
‘ఐపీఎల్ 16వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన శుభ్మన్ గిల్ తన సొంత వేదికగా పాకిస్థాన్తో ఆడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ వేదికతో భారత జట్టు ఐసీసీ ఈవెంట్లలో చాలా మంచి జ్ఞాపకాలను కలిగి ఉందని, అయితే ఈ సీజన్లోని ఐపీఎల్ మ్యాచ్లను నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడడం, కొన్ని వన్డేలతో పాటు మాకు చాలా ఇచ్చిందని అశ్విన్ తెలిపాడు. ఈ వేదిక అందరికి స్ఫూర్తి.. చాలా నేర్చుకోవచ్చు. పాకిస్థాన్తో మ్యాచ్లో శుభ్మన్ గిల్ చాలా ముఖ్యమైన ఆటగాడిగా నిరూపించుకోగలడు. ఎందుకంటే ఈ మైదానం గురించి మిగతా ఆటగాళ్ల కంటే అతనికి బాగా తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.