IND vs AFG: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజాలు రెడీ.. ఎప్పుడంటే?

Afghanistan Tour of India 2026: భారత జట్టు ఆఫ్ఘాన్‌తో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి బ్లూ జెర్సీతో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఆ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఓసారి చూద్దాం..

IND vs AFG: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజాలు రెడీ.. ఎప్పుడంటే?
Rohit Virat

Updated on: Mar 02, 2026 | 3:56 PM

Afghanistan Tour of India 2026: భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) 2026 జూన్‌లో జరగనున్న ఆఫ్ఘానిస్తాన్ భారత పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు ఆసియా జట్ల మధ్య మల్టీ-ఫార్మాట్ పోటీలు జరగనున్నాయి. అదనంగా, భారత్-ఆఫ్ఘానిస్తాన్ జట్లు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా తలపడనున్నాయి.

టెస్టుతో న్యూ చండీగఢ్ వేదిక ప్రారంభం..

ఈ పర్యటన జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లో జరిగే ఒక్కటే టెస్టు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. అనంతరం వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమవుతుంది.

మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్..

జూన్ 14 – తొలి వన్డే – ధర్మశాల

జూన్ 17 – రెండో వన్డే – ఎకానా స్టేడియం

జూన్ 20 – మూడో వన్డే – ఎమ్.ఏ.చిదంబరం స్టేడియం

ఈ సిరీస్ భారత్‌కు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు చివరి హోమ్ సిరీస్ కావడం విశేషం. 2027 ప్రపంచకప్‌కు ముందు ఎక్కువగా వన్డే మ్యాచ్‌లు ఆడాలని భారత్ ప్రయత్నిస్తోంది.

ఇంగ్లాండ్ పర్యటన 2026 – వైట్ బాల్ సవాల్..

ఆఫ్ఘానిస్తాన్ సిరీస్ అనంతరం, భారత్ జూలైలో ఇంగ్లాండ్‌కు పర్యటించనుంది. అక్కడ ఐదు టీ20లు, మూడు వన్డేలు జరుగనున్నాయి. 2025లో టెస్ట్ కెప్టెన్సీని ఇంగ్లాండ్ పర్యటనతో ప్రారంభించిన యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఈ సారి వన్డే సిరీస్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లకు వన్డేల్లో పరాజయాలు చవిచూసిన భారత్‌కు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

టీ20 సిరీస్ వేదికలు..

జులై 1 – రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్-లీ-స్ట్రీట్

జులై 4 – ఓల్డ్ ట్రాఫర్డ్

జులై 7 – ట్రెంట్ బ్రిడ్జ్

జులై 9 – బ్రిస్టల్

జులై 11 – సౌథాంప్టన్

వన్డే సిరీస్ వేదికలు..

జులై 14 – ఎడ్జ్‌బాస్టన్

జులై 16 – సోఫియా గార్డెన్స్

జులై 19 – లార్డ్స్

రోహిత్, కోహ్లీకి కీలకం..

భారత్ లెజెండ్స్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) 2027 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొనడం దాదాపు ఖాయం అయింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచకప్‌నకు ముందు వీరికి ఈ వన్డే మ్యాచ్ అనుభవం ఎంతో అవసరం.

ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు.. వన్డేల్లో పూర్తి దృష్టి పెట్టనున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆఫ్ఘానిస్తాన్‌పై జరిగే వన్డే సిరీస్‌లో వీరు మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us