AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో భారత ఆటగాళ్ల కష్టాలు.. ఆహారం నుంచి రూముల వరకు.. అన్నింట్లోనూ కొరతే..

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశం నుంచి 200 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లతో కూడిన భారీ బృందం వెళ్లింది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ను కూడా చేర్చారు.

కామన్వెల్త్ గేమ్స్ విలేజ్‌లో భారత ఆటగాళ్ల కష్టాలు.. ఆహారం నుంచి రూముల వరకు.. అన్నింట్లోనూ కొరతే..
Cwg 2022 Women Cricket Team
Venkata Chari
|

Updated on: Jul 28, 2022 | 1:15 PM

Share

కామన్వెల్త్ గేమ్స్ 2022 నేడు (జులై 28) ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఈ గేమ్‌లు ఆగస్టు 8 వరకు జరుగుతాయి. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశం నుంచి 200 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లతో కూడిన భారీ బృందం సత్తా చాటేందుకు వెళ్లింది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌ను కూడా చేర్చారు. దీంతో టీమిండియా మహిళలు బంగారు పతకం కోసం తమ తొలి పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ తర్వాత పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్ ఆడనున్నారు. కాగా, బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్‌కు వచ్చిన భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారులు కూడా కొన్ని ఫిర్యాదులు చేశారు. చాలా మంది ఆటగాళ్లు ఒకే గదిని పంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, తినడానికి హోటల్ (స్పోర్ట్స్ విలేజ్) నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

కెప్టెన్‌కి మాత్రమే ప్రత్యేక గది..

వార్తల ప్రకారం, జట్టు ఆటగాళ్లకు ప్రత్యేక గదులను డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకు భారత ఒలింపిక్ సంఘం (IOA) భాగస్వామ్య గదులను మాత్రమే అందించింది. ఇక్కడ ఆటగాళ్లకు ఆహారం కూడా సక్రమంగా అందడం లేదు. చాలా మంది ఆటగాళ్లు ఆహారం కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకు కెప్టెన్‌కు మాత్రమే ప్రత్యేక గది ఇచ్చారిని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన కారణాలను ఇప్పటి వరకు మాకు చెప్పలేదు.

పీవీ సింధులో కరోనా లక్షణాలు..

మరోవైపు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఐసోలేషన్‌లో ఉంచారు. తొలి కోవిడ్ పరీక్షలో కరోనా కొన్ని లక్షణాలు వెలుగు చూశాయి. ఆమెతో పాటు వచ్చిన ఇతర ఆటగాళ్లను కూడా పరీక్షించినట్లు తెలుస్తోంది.

కొన్ని తేలికపాటి లక్షణాలు కనిపించినప్పుడు, ముందు జాగ్రత్తగా వారిని ఐసోలేషన్‌లో ఉంచామని అధికారులు తెలిపారు. అయితే రెండో టెస్టులో పీవీ సింధుకు పూర్తిగా నెగిటివ్‌గా రావడంతో అందరూ ఇప్పుడు జట్టుతో చేరారు.

సింధు, మన్‌ప్రీత్‌లు ప్లాగ్ బేరర్స్..

ఈసారి ప్రారంభ వేడుకలకు పీవీ సింధుతో పాటు హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ జెండా బేరర్‌గా మారారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరచుగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ టాప్-3లోకి చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈసారి కూడా భారతదేశం ఇక్కడ చరిత్ర సృష్టించాలని భావిస్తున్నారు.

నీరజ్ చోప్రా, మేరీకోమ్ గైర్హాజరీలో ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధు, మీరాబాయి చాను, రవి దహియా, నిఖత్ జరీన్, మనికా బాత్రా సహా పలువురు క్రీడాకారిణుల నుంచి భారత్‌కు బంగారు పతకం ఆశలు ఉన్నాయి.